Modi Cabinet: పీఎంవో కొత్త సేవా తీర్థంలో నేడు కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
- పీఎంవో కొత్త సేవా తీర్థంలో నేడు మోడీ కేబినెట్ భేటీ
- ఉ.11 గంటలకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయం మారింది. సౌత్ బ్లాక్ నుంచి కొత్తగా నిర్మించిన సేవా తీర్థం నిర్మాణంలోకి మార్చబడింది. ఈ సేవా తీర్థంలోనే తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్తో పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
ఇక ఫిబ్రవరి 13న సేవా తీర్థం కొత్త కార్యాలయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ కొత్త కార్యాలయంలోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు సేవా తీర్థం గురించి సౌత్ బ్లాక్లో జరిగిన గత మంత్రివర్గ సమావేశంలోనే అనేక జ్ఞాపకాలను మోడీ పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదటి నాలుగు కేబినెట్ సమావేశాలు స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్రపతి భవన్లో ఎలా జరిగాయో మంత్రులకు మోడీ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సౌత్ బ్లాక్లో తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలను కూడా గుర్తు చేసుకున్నారు. సౌత్ బ్లాక్లోని వార్ రూమ్లో దేశంలోని నాలుగు ప్రధాన యుద్ధాలకు వ్యూహాలను ఎలా రూపొందించారో మోడీ వివరించారు.
ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
గతంలో రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లో ఉన్న కేబినెట్ సెక్రటేరియట్ను కూడా సౌలభ్యం కోసం సేవా తీర్థానికి మార్చారు. త్వరలో ప్రధానమంత్రి నివాసం కూడా సేవా తీర్థానికి సమీపంలోనే నిర్మించనున్నారు. ఇది పూర్తైతే కొత్త పార్లమెంట్ భవనం, కొత్త ప్రధానమంత్రి కార్యాలయం, నివాసం.. అన్ని మంత్రిత్వ శాఖలు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఇది VVIP ల కదలికల వల్ల తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జామ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Krishnamachari Srikkanth: “గంభీర్ ఇప్పటికైనా మారు”.. కోచ్ నిర్ణయాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఫైర్!
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!