Trump: భారత్ టార్గెట్గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- భారత్ టార్గెట్గా ట్రంప్ మరో వాణిజ్య దాడి
- సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- ఇటీవలే గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా రద్దు చేసిందో లేదో వెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం గంటల వ్యవధిలోనే దాన్ని 15 శాతానికి పెంచారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
తాజాగా అమెరికా పార్లమెంటులో వార్షిక ప్రసంగంలో ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. భారతదేశం, ఇండోనేషియా, లావోస్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. ఈ మూడు దేశాల నుంచి ఎక్కువగా సౌరశక్తి ఉత్పత్తులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఛత్రపతి శివాజీ మహరాజ్కు ఘోర అవమానం.. మహాయోధుడి చిత్రాన్ని ఇలా వాడుకోవడం ఏంటి?
వాణిజ్య శాఖ డేటాను పరిశీలిస్తే.. 2024 సంవత్సరంలో అమెరికా భారతదేశం నుంచి సౌరశక్తి దిగుమతుల విలువ 792.6 మిలియన్ డాలర్లు ఉంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే భారీ పెరుగుదలను నమోదు చేసింది. అయితే ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న మూడు దేశాల నుంచి గత సంవత్సరం సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సౌరశక్తి ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. దీని ఆధారంగా 2025 మొదటి అర్ధభాగంలో US సౌర నమూనా దిగుమతుల్లో 57 శాతం భారతదేశం, ఇండోనేషియా, లావోస్ నుంచి మాత్రమే వచ్చాయని నివేదిక పేర్కొంది.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం నుంచి వచ్చే సౌరశక్తి ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా వాణిజ్య శాఖ 126 శాతం సుంకాన్ని విధించింది. ఇండోనేషియాకు 86 శాతం నుంచి 143 శాతం వరకు ఉంటుంది. లావోస్కు ఇది 81 శాతం ఉంటుంది. ఈ దిగుమతి సుంకం రేట్లు విదేశీ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ దేశాల నుంచి ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను దేశీయ సౌరశక్తి ఉత్పత్తిదారుల కంటే తక్కువ ధరకు విక్రయించడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా విశ్వసిస్తోంది. భారీ సుంకాలను విధించాలనే ట్రంప్ పరిపాలన చర్య దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉంది.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..