Trump: భారత్ టార్గెట్గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- భారత్ టార్గెట్గా ట్రంప్ మరో వాణిజ్య దాడి
- సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- ఇటీవలే గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా రద్దు చేసిందో లేదో వెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం గంటల వ్యవధిలోనే దాన్ని 15 శాతానికి పెంచారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
తాజాగా అమెరికా పార్లమెంటులో వార్షిక ప్రసంగంలో ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. భారతదేశం, ఇండోనేషియా, లావోస్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. ఈ మూడు దేశాల నుంచి ఎక్కువగా సౌరశక్తి ఉత్పత్తులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఛత్రపతి శివాజీ మహరాజ్కు ఘోర అవమానం.. మహాయోధుడి చిత్రాన్ని ఇలా వాడుకోవడం ఏంటి?
వాణిజ్య శాఖ డేటాను పరిశీలిస్తే.. 2024 సంవత్సరంలో అమెరికా భారతదేశం నుంచి సౌరశక్తి దిగుమతుల విలువ 792.6 మిలియన్ డాలర్లు ఉంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే భారీ పెరుగుదలను నమోదు చేసింది. అయితే ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న మూడు దేశాల నుంచి గత సంవత్సరం సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సౌరశక్తి ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. దీని ఆధారంగా 2025 మొదటి అర్ధభాగంలో US సౌర నమూనా దిగుమతుల్లో 57 శాతం భారతదేశం, ఇండోనేషియా, లావోస్ నుంచి మాత్రమే వచ్చాయని నివేదిక పేర్కొంది.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం నుంచి వచ్చే సౌరశక్తి ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా వాణిజ్య శాఖ 126 శాతం సుంకాన్ని విధించింది. ఇండోనేషియాకు 86 శాతం నుంచి 143 శాతం వరకు ఉంటుంది. లావోస్కు ఇది 81 శాతం ఉంటుంది. ఈ దిగుమతి సుంకం రేట్లు విదేశీ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ దేశాల నుంచి ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను దేశీయ సౌరశక్తి ఉత్పత్తిదారుల కంటే తక్కువ ధరకు విక్రయించడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా విశ్వసిస్తోంది. భారీ సుంకాలను విధించాలనే ట్రంప్ పరిపాలన చర్య దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!