PM Modi: నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటన.. కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
- నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటన
- కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోడీ ఈరోజు ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి రెండు రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. 2015లో రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్లో పర్యటించి పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం మోడీకి దక్కింది. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ను కూడా మోడీ కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan vs England: పాకిస్థాన్కు బిగ్ షాక్.. సెమీఫైనల్కు చేరాలంటే పాక్ ముందున్న దారులు ఇవే..!
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడే విధంగా ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూస్ గోయల్ కూడా ఇటీవలే ఇజ్రాయెల్లో పర్యటించి వచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం కూడా ఇటీవల ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కూడా పాల్గొంది. తాజా పర్యటనతో మరింత బలపడనున్నాయి.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ వ్యక్తిగత స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ‘రాడికల్’ విరోధులను ఎదుర్కోవడానికి కొత్త కూటమిని (షడ్భుజ) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆదివారం ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. ‘‘ఇజ్రాయెల్తో విశ్వాసం, ఆవిష్కరణ, శాంతి, పురోగతి పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడిన శాశ్వత స్నేహాన్ని భారతదేశం ఎంతో విలువైనదిగా భావిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
నెతన్యాహు కూటమిలో భారతదేశం, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లను కీలక భాగస్వాములుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా కూటమిలో చేరవచ్చు అని పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఇంకోవైపు పాకిస్థాన్-సౌదీ అరేబియా నాటో లాంటి కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో టర్కీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో కొత్త కూటమి ఏర్పాటు కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
-
Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?