PM Modi: నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటన.. కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
- నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటన
- కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోడీ ఈరోజు ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి రెండు రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. 2015లో రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్లో పర్యటించి పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం మోడీకి దక్కింది. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ను కూడా మోడీ కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan vs England: పాకిస్థాన్కు బిగ్ షాక్.. సెమీఫైనల్కు చేరాలంటే పాక్ ముందున్న దారులు ఇవే..!
Also Read
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడే విధంగా ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూస్ గోయల్ కూడా ఇటీవలే ఇజ్రాయెల్లో పర్యటించి వచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం కూడా ఇటీవల ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కూడా పాల్గొంది. తాజా పర్యటనతో మరింత బలపడనున్నాయి.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ వ్యక్తిగత స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ‘రాడికల్’ విరోధులను ఎదుర్కోవడానికి కొత్త కూటమిని (షడ్భుజ) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆదివారం ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. ‘‘ఇజ్రాయెల్తో విశ్వాసం, ఆవిష్కరణ, శాంతి, పురోగతి పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడిన శాశ్వత స్నేహాన్ని భారతదేశం ఎంతో విలువైనదిగా భావిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
నెతన్యాహు కూటమిలో భారతదేశం, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లను కీలక భాగస్వాములుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా కూటమిలో చేరవచ్చు అని పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఇంకోవైపు పాకిస్థాన్-సౌదీ అరేబియా నాటో లాంటి కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో టర్కీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో కొత్త కూటమి ఏర్పాటు కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!