Cash Prize for Hockey India Team: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత్ కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో…
Neeraj Chopra Said I gave my best in Paris Olympics 2024: భారతదేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తెలిపాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో చాలా పోటీ ఉందని, ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడన్నాడు. ఇది అర్షద్ నదీమ్ డే అని, తాను మాత్రం వందశాతం కష్టపడ్డా అని నీరజ్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా (89.45 మీటర్లు)…
Iam happy with Silver Medal in Paris Olympics 2024 Says Neeraj Chopra Mother: పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్లో పాకిస్తాన్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరాడు. భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ను సాధించాడు. నీరజ్ సిల్వర్ మెడల్ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి.…
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 2-1తో స్పెయిన్ను ఓడించి ఒలింపిక్స్లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
President Droupadi Murmu Congratulates Neeraj Chopra For Olympic Silver: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైసవం చేసుకున్నాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. ఇక గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. సిల్వర్…
Neeraj Chopra wins silver medal with 89.45m in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తంగా 12 మంది పోటీ పడ్డ ఫైనల్లో మన బల్లెం వీరుడు రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాల్లో…
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. జట్టు విజయం సాధించినందుకు మోడీ అభినందనలు తెలిపారు. జట్టు అనుభవజ్ఞుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీజేష్కి ఇదే చివరి మ్యాచ్ కావడంతో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు.
ఆసియా క్రీడల రజత పతక విజేత, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయింది. పరుగుల రాణిగా పేరొందిన 24 ఏళ్ల జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించలేకపోయింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీస్ లో ఓడిన భారత జట్టు.. కాంస్య పతక పోరులో స్పెయిన్ పై 2-1 తేడాతో విక్టరీ నమోదు చేసింది. దీంతో.. భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు చేరాయి.