Neeraj Chopra: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు!
- నీరజ్ చోప్రాకు రజత పతకం
- పాకిస్తాన్ అథ్లెట్కు గోల్డ్
- ఐదుకు చేరిన భారత్ పతకాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra wins silver medal with 89.45m in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తంగా 12 మంది పోటీ పడ్డ ఫైనల్లో మన బల్లెం వీరుడు రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు. మిగతా ఐదు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు.
పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లు విసిరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడలిస్ట్ అర్షద్.. రెండుసార్లు ఈటెను 90 మీటర్ల కంటె ఎక్కువగా విసిరాడు. 11 మందిలో ఎవరూ కూడా 90 మీటర్ల మార్కును అందుకోలేకపోయారు. 26 ఏళ్ల నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి.. ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫయింగ్లో 89.34 మీటర్లతో టాప్ ర్యాంక్లో నిలిచిన నీరజ్.. ఫైనల్లో మాత్రం కాస్త ఒత్తిడికి లోనయ్యాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత అయిన నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్లోనూ స్వర్ణం సాధిస్తాడని యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది. నీరజ్ మెరుగైన ప్రదర్శన చేసినా.. పాకిస్తాన్ అథ్లెట్ అనూహ్య ప్రదర్శనతో రెండో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. వరుస రెండు ఒలింపిక్స్ పోటీల్లో రెండు పతకాలు అందుకున్న భారత బల్లెం వీరుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. గత ఒలింపిక్స్లో నీరజ్ 87.58 మీటర్లతో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్లో ఇప్పటివరకు భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!