Hockey India: పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం.. ఆటగాళ్లకు ‘హాకీ ఇండియా’ నజరానా!
- హాకీ ఆటగాళ్లకు నజరానా
- ఆర్పీ శ్రీజేశ్ గుడ్ బై
- 52 ఏళ్ల తర్వాత వరుసగా పతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash Prize for Hockey India Team: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత్ కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో ప్లేయర్లకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. టీమ్ ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఓ ప్రకటనలో తెలిపారు.
‘భారత హాకీ జట్టు కఠిన శ్రమ, నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కష్టంతో ఈ పతకం దక్కింది. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ పతకం గెలవడం అద్భుతం. ప్రపంచ వేదికపై భారత హాకీ పునర్జీవాన్ని ప్రతిబింబిస్తుంది. భారత జట్టు సాధించిన దానికి ఈ నజరానా సరితూగదు. కానీ ప్రోత్సాహకం ఇవ్వడం ముఖ్యం. ఆర్పీ శ్రీజేష్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అతడి వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నారు.
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
Also Read: Neeraj Chopra: నేను వందశాతం కష్టపడ్డా.. ఇది అర్షద్ డే: నీరజ్ చోప్రా
స్పెయిన్పై చివరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికిన ఆర్పీ శ్రీజేశ్.. భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్ పోస్టు ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అతడిని తన భుజాలపై ఎత్తుకుని మైదానంలో తిరిగాడు. 1968, 1972లో భారత్ కాంస్య పతకాలు గెలుచుకుంది. 52 ఏళ్ల తర్వాత వరుసగా (2020, 2024) రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!