గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన…
కేసీఆర్ ఇతర రాష్ట్రంలో రైతులకు పరిహారం ఇవ్వడంపై అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవచేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇవాల్టి (శనివారం) నుంచి పునఃప్రారంభించనున్న సంగతి తెలిసిందే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ పైలాన్ నుంచే పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ.. టిఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆగ్రహం…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం బీజేపీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట…..అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా…
150 ఏళ్ళ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపి అనంతరం దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఇప్పుడు దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయితో పాటు తెలంగాణలోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు. నాయకులు తమకు తాము అధినేతలుగా భావిస్తూ.. వర్గ రాజకీయాలను పెంచుకుంటూ పోతున్నారు. ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు…బాధల తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం. ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి? https://ntvtelugu.com/anchor-anasuya-fires-on-netizen/ ఎన్నికలప్పుడు గారడీ మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి? మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు వైఎస్ షర్మిల.…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు. అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ…
కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్క రేపటినుంచి మళ్లీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా నిలిచి పోయిన పాదయాత్ర కొనసాగించనున్నారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు, అదేవిధంగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మార్చ్ పేరిట గత నెల 27న ముదిగొండ మండలం యడవెల్లిలో పాదయాత్రను చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల వల్ల 102 కిలోమీటర్ల దూరం కొనసాగిన యాత్ర గంధసిరి వద్ద…
పంజాబ్లో విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో మరింత జోష్ పెరిగింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మరికొన్ని పాదయాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు తెలంగాణలో ఆమ్ఆద్మీ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు. అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో…