Adulterated Food: భాగ్యనగరంలో కల్తీ ఫుడ్ కలకలం.. భారీగా వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
- ఎం.ఎస్.మఖ్తాలోని తయారీ కేంద్రంపై మెరుపు దాడి
- 4 వేల కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వలు స్వాధీనం
- 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, వెయ్యి కిలోల ఉప్పు
- 5 కిలోల పసుపు పొడి, గ్రైండింగ్ మిషన్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది కొంత మంది కేటుగాళ్ల వ్యవహార శైలి. జనం ఉపయోగించే ఆహార పదార్థాలను తమ స్వలాభాల కోసం యథేచ్ఛగా కల్తీ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న కల్తీ టీ పౌడర్ను పట్టుకున్న పోలీసులు.. తాజాగా భారీగా కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కేటుగాడ్ని అరెస్ట్ చేశారు.
సబ్బులు, షాంపూలు మాత్రమే కాదు.. టీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కల్తీ చేసేస్తున్నారు. తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ చేసి దర్జాగా వ్యాపారం చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఇది కూడా చదవండి: Mu*rder Case: వేములపల్లిలో పరువు హత్య.. సొంత చెల్లెలిపై కక్ష కట్టిన సోదరులు.!
ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉదంతం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పక్కా సమాచారంతో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎం.ఎస్.మఖ్తా ప్రాంతంలోని ఒక తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. 4 వేల కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, వెయ్యి కిలోల ఉప్పు, 5 కిలోల పసుపు పొడి, గ్రైండింగ్ మిషన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ అరెస్ట్
అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో.. ఆరోగ్యానికి హానికరమైన రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జేజే ఫుడ్స్’ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ పేస్ట్ను బహిరంగంగా ప్లాస్టిక్ టబ్బులలో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలు వచ్చి చేరాయి. అలాగే ఈ జేజే ఫుడ్స్ కాలం చెల్లిన FSSAI లైసెన్స్ను వినియోగిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. వేల కిలోలుగా తయారు చేస్తున్న ఈ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు ఇల్యాన్ సరఫరా చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Sircilla Crime News : వీడు మామూలోడు కాదు.. మహా మాయగాడు
సాధారణంగా ఈ కల్తీ పేస్ట్ తయారీలో కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పాటు బరువు పెరగడానికి టిటాన్ డయాక్సైడ్, గమ్ పౌడర్, ప్రమాదకరమైన సింథటిక్ రంగులను వాడుతుంటారు. నిల్వ ఉండటానికి అనుమతించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల ఇవి విషతుల్యంగా మారుతాయి. పోలీసులు రైడ్ చేయని పక్షంలో ఆ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వలు మార్కెట్లోకి వెళ్లి ఉండేది. ఫలితంగా వేలాదిమంది గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి బారిన పడే ప్రమాదం ఉండేదంటున్నారు పోలీసులు.
మరోవైపు ఇల్యాన్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4), 275 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..