YS Sharmila: కేసీఆర్ని మళ్ళీ నమ్మి మోసపోవద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు.
అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ లో రైతు బంధు అని ఐదువేలు ఇస్తున్నాడు. ఎరువుల సబ్సిడీ లేదు. పంట నష్టం పరిహారం మాటలేదు. వరి కూడా వేసుకోవద్దు అంటాడు. పంట కొనేది లేదు అని తెగేసి చెప్పి రైతులను కోలుకోకుండా చేశాడన్నారు షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు. నీళ్లను ఎత్తి పోస్తున్నాం అని ఆఖరికి సముద్రంలోనే కలుపుతుండు.
Also Read
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. వడ్లు కొనే బాధ్యత ఎవరిది? ఓట్లు వేసింది ఎవరికి? కేసీఆర్ మాటలను నమ్మి రెండుసార్లుగెలిపిస్తే రైతుని బానిసల్ని చేశాడు. లక్ష90 వేల ఉద్యోగాలు ఉంటే అందులో 90వేల ఉద్యోగాల్లో 30 వేలు భర్తీచేస్తానన్నాడు. పిల్లల కోసమైనా ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పేవాడు సరిగా లేడు. చదువు లేదు, రుణమాఫీ లేదు. ఎవరైనా ఆలోచిస్తున్నారా మంచోడు మంచోడు అంటే మంచం కాళ్ళు ఎత్తుకు పోయాడన్నట్టుగా తయారయ్యాడు.
తెలంగాణ పేరు మీద ఇంటికో ఉద్యోగం అన్నాడు .. కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఒక్కో కుటుంబం మీద 4 లక్షల అప్పు వుందన్నారు షర్మిల. కుటుంబానికి 2లక్షల రూపాయలు ఇవ్వాలి ఇచ్చాడా లేదు డబ్బులన్నీ వాళ్ళ జేబులోకి పోయినాయి. కాంగ్రెస్ పార్టీ కి ఓట్లేస్తే పశువులను కొన్నట్టు కొన్నాడు. రాజకీయ వ్యభిచారం కదా ఇది. కేసీఆర్ చేతుల్లో రెండుసార్లు మొసపోయాం. ప్రతి పక్షాలు ప్రభుత్వాలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయి. మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డను తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్చడంకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి మీ ముందుకు వచ్చింది ఆశీర్వదించండి అన్నారు వైఎస్ షర్మిల.
- Tags
- cm kcr
- Farmers
- modi
- no subsidy
- Padayatra
తాజావార్తలు
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో