Village Empty: ఊరంతా ఖాళీ .. పోలీస్ స్టేషన్లో జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఊరంతా గ్రామస్థులు ఎవరూ లేకుండా ఖాళీ అయ్యింది, ప్రజలంతా ఏదో జాతరకు లేదా విహారయాత్రకు వెళ్ళి వుంటారని మీరనుకుంటే మీరు పొరపడినట్లే. ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులంతా ఎక్కడున్నారో అనుకుంటున్నారా.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అసలు ఎందుకు ఊరంతా ఖాళీ అయింది, ప్రజలందరూ పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్థులు ఎవరు లేకుండా ఖాళీ అయ్యింది, ఆ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు? అసలు ఏమి జరిగింది ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నారో తెలుసా?
గత 10 రోజుల క్రితం నుండే ఆ ఊరికి చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా సమస్యలను తీర్చండి లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతి భవన్ హైదరాబాద్ కి పాదయాత్ర చేస్తూ వెళతాం అంటూ రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప ప్రజాప్రతినిధులకు, అధికారులను వేడుకున్నారు. మీ సమస్యలు ఏమిటి అని అడిగిన నాధుడే నిన్నటి వరకు లేడు, రాత్రి అశ్వారావుపేట ఎంపీపీ కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీసులు అందరూ కలిసి రామన్నగూడెం గ్రామానికి వెళ్లి మీరు రేపు నిర్వహించే పాదయాత్ర నిర్వహించవద్దు మీ సమస్యలు ఏంటో తెలపాలని కోరారు.
Also Read
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
- OTR : జూబ్లీ హిల్స్ BRSలో మూడు ముక్కలాట! కేటీఆర్కే తలనొప్పిగా మారిన హాట్ సీట్?
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
ఎప్పటినుంచో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పినవి అర్హులైన వారికి ఇవ్వాలని, అలానే రామన్నగూడెం పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనిచేయడానికి నిధులు కేటాయించడం లేదని నిధులు కావాలన్నారు. అలాగే వెంకమ్మ చెరువు శిఖం నిమిత్తం భూములు కోల్పోయినవారికి 14 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఇంకా పలు సమస్యలు తెలిపారు, వెళ్లిన అధికారులు ప్రజాప్రతినిధులు రామన్నగూడెం గ్రామస్థులకు సరైన హామీ ఇవ్వకపోవడంతో ఉదయం 5 గంటల నుండి పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమయ్యారు, అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అర్థరాత్రి సర్పంచ్ స్వరూపని కొంతమంది గ్రామస్తులను ముందస్తు అరెస్ట్ లు చేశారు.
మళ్ళీ ఏమనుకున్నారో ఏంటో రాత్రే వదిలేశారు. అయితే ఉదయం పాదయాత్ర ప్రారంభించి అశ్వారావుపేట మండలం గంగారాం గ్రామానికి వచ్చేసరికి పోలీసులు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్న రామన్నగూడెం గిరిజనులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.ఎంతకీ గ్రామస్థులు వినకపోవడంతో పోలీస్ బలగాలతో గిరిజనులందరిని వ్యాన్ లో ఎక్కించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి స్టేషన్ కి తరలించారు. కొందరిని కిన్నెరసాని పోలీస్ స్టేషన్ కి తరలించారు, అలా సమస్యలు పరిష్కారానికి పాదయాత్ర నిర్వహిస్తున్న రామన్నగూడెం గ్రామస్థులని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఊరంతా ఖాళీ అయి ప్రజలంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
Dhanush OM : కర ప్లాప్ తర్వాత కెరీర్లో బిగ్ రిస్క్ చేస్తున్న ధనుష్
-
Manoj Bajpayee : చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు.. మనోజ్ బాజ్పాయ్ ఆవేదన
-
Yoga Day Questions: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇది మీకోసమే!
-
FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్లోకి అడుగు.!
-
International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!