Village Empty: ఊరంతా ఖాళీ .. పోలీస్ స్టేషన్లో జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఊరంతా గ్రామస్థులు ఎవరూ లేకుండా ఖాళీ అయ్యింది, ప్రజలంతా ఏదో జాతరకు లేదా విహారయాత్రకు వెళ్ళి వుంటారని మీరనుకుంటే మీరు పొరపడినట్లే. ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులంతా ఎక్కడున్నారో అనుకుంటున్నారా.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అసలు ఎందుకు ఊరంతా ఖాళీ అయింది, ప్రజలందరూ పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్థులు ఎవరు లేకుండా ఖాళీ అయ్యింది, ఆ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు? అసలు ఏమి జరిగింది ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నారో తెలుసా?
గత 10 రోజుల క్రితం నుండే ఆ ఊరికి చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా సమస్యలను తీర్చండి లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతి భవన్ హైదరాబాద్ కి పాదయాత్ర చేస్తూ వెళతాం అంటూ రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప ప్రజాప్రతినిధులకు, అధికారులను వేడుకున్నారు. మీ సమస్యలు ఏమిటి అని అడిగిన నాధుడే నిన్నటి వరకు లేడు, రాత్రి అశ్వారావుపేట ఎంపీపీ కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీసులు అందరూ కలిసి రామన్నగూడెం గ్రామానికి వెళ్లి మీరు రేపు నిర్వహించే పాదయాత్ర నిర్వహించవద్దు మీ సమస్యలు ఏంటో తెలపాలని కోరారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
ఎప్పటినుంచో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పినవి అర్హులైన వారికి ఇవ్వాలని, అలానే రామన్నగూడెం పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనిచేయడానికి నిధులు కేటాయించడం లేదని నిధులు కావాలన్నారు. అలాగే వెంకమ్మ చెరువు శిఖం నిమిత్తం భూములు కోల్పోయినవారికి 14 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఇంకా పలు సమస్యలు తెలిపారు, వెళ్లిన అధికారులు ప్రజాప్రతినిధులు రామన్నగూడెం గ్రామస్థులకు సరైన హామీ ఇవ్వకపోవడంతో ఉదయం 5 గంటల నుండి పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమయ్యారు, అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అర్థరాత్రి సర్పంచ్ స్వరూపని కొంతమంది గ్రామస్తులను ముందస్తు అరెస్ట్ లు చేశారు.
మళ్ళీ ఏమనుకున్నారో ఏంటో రాత్రే వదిలేశారు. అయితే ఉదయం పాదయాత్ర ప్రారంభించి అశ్వారావుపేట మండలం గంగారాం గ్రామానికి వచ్చేసరికి పోలీసులు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్న రామన్నగూడెం గిరిజనులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.ఎంతకీ గ్రామస్థులు వినకపోవడంతో పోలీస్ బలగాలతో గిరిజనులందరిని వ్యాన్ లో ఎక్కించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి స్టేషన్ కి తరలించారు. కొందరిని కిన్నెరసాని పోలీస్ స్టేషన్ కి తరలించారు, అలా సమస్యలు పరిష్కారానికి పాదయాత్ర నిర్వహిస్తున్న రామన్నగూడెం గ్రామస్థులని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఊరంతా ఖాళీ అయి ప్రజలంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!