Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Story Board: డబ్బిస్తే..…
సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయి కొట్టుకోవడం ఎప్పుడైనా చూసుంటారా.. చూసే ఉంటారు.. అది ఎక్కడో ఒక చోట కామన్ గా జరుగుతుంది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది. ఒక యువకుడిపై మనసు పడిన ఇద్దరు మహిళలు.. అతడి కోసం గొడవలు పడ్డారు. దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది. Read Also: Job…
ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి.. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు..
ఒంగోలు పోట్ల గిత్తల పోరు కొత్త టర్న్ తీసుకుంటోందా? కూటమిలో అంటుకున్న మంటలు చల్లారకపోగా…. హరిహరవీరమల్లు సినిమా రూపంలో… ఇంకాస్త పెట్రోల్ యాడ్ అయిందా? కలిసి పని చేసుకోమని టీడీపీ, జనసేన అధిష్టానాలు చెబుతున్నా… నియోజకవర్గ నేతలు వినే పరిస్థితిలో లేరా? ఇంతకూ పవన్ సినిమాకి, ఒంగోలు పాలిటిక్స్కు సంబంధం ఏంటి? అక్కడ కూటమిలో అసలేం జరుగుతోంది? ఒంగోలులో కూటమి రాజకీయం కుతకుతలాడిపోతోందట. ఇద్దరు ముఖ్య నాయకుల ఆధిపత్య పోరు ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా…
Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్…
Road Accidents: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కొప్పోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఒంగోలులో టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం…
దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలులో కలకలం రేపింది. మంగళవారం రాత్రి 7.30 గంటల…
వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీలో చేరగా.. బాలినేని ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరరేందుకు సిద్ధమయ్యారు వైసీపీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు.. పవన్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో- ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు..
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల మధ్య వార్ కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అందరూ వైసిపి కార్పొరేటర్లే అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.