CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు
- టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు
- వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు
ఒంగోలులో టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read:TG: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జీర్ణించుకోలేకపోతున్నాను.. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది.. హత్య పైన నిన్నటి నుంచి అన్ని విధాల అన్వేషిస్తున్నాం.. 12 టీములతో దర్యాప్తు చేస్తున్నాం.. కరుడు కట్టిన నేరస్తులతో హత్య చేయించారు.. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని పిస్తుంది.. వీరయ్య చౌదరి మంచి నాయకుడు, సమర్థమైన వ్యక్తి.
Also Read:GHMC : ప్రశాంతంగా ముగిసిన జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు
యువగళం సమయంలో 100 రోజులు నారా లోకేష్ తో తిరిగారు.. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో రైతులకు అండగా నిలబడ్డాడు.. ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజక వర్గాల్లో వీరయ్య చౌదరి పని చేశారు.. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగడం జీర్ణించుకోలేకపోతున్నా.. సీసీటీవీ కెమెరాల నుంచి క్లూస్ కూడా తీసుకుంటున్నాం.. ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వండి.. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారు..
Also Read:GHMC : ప్రశాంతంగా ముగిసిన జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు
నేరగాళ్లను పట్టుకుని తీరుతాం, కఠిన శిక్ష విధిస్తాం.. మా కుటుంబ సభ్యుల లాగా వీరయ్య కుటుంబాన్ని చేసుకుంటాం.. నేర రాజకీయాలు చేసేవాళ్లను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం.. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు.. హత్యలు చేయడం దుర్మార్గమైన పని.. హత్య కేసును ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదు.. రాజకీయ కోణం, వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేక పోవడం లాంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. నేరస్తులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!