దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కరోనా బారిన పడ్డారు. ఆయనలో కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సిరిల్ రామఫోసా కేప్టౌన్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిరిల్కు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని అనుమానపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం…
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబడిన వారి అందిరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్…
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. Read: డెంగీతో బీజేపీ…
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్నది. సౌతాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ ఎంత మేరకు ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకోగలుగుతుంది అనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను పూర్తిగా అడ్డుకోలేవని, ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా… వ్యాక్సిన్ తీసుకోవడం కొంత మంచిదే అని, వేరియంట్ తీవ్రత, మరణం నుంచి కాపాడగలడం సరైందే అని డబ్ల్యూహెచ్ఓ…
ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన తరువాత ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ కోసం శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాల్సి ఉంటుంది. జీనోమ్ సీక్వెన్సింగ్ నుంచి నిర్ధారణ పూర్తయ్యి ఫలితాలు వచ్చే సరికి రెండు వారాల సమయం పుడుతున్నది. నెగిటివ్ వస్తే సరే, పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి? ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం తీసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు…
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లోనూ, రెండో కేసు ఛండీగడ్లోనూ నమోదుకాగా, మూడో కేసు కర్ణాటకలో బయటపడింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన మరో కేసుతో కలిపి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చర్యపరిచిన కస్టమర్……
ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి రూపాంతరాలు చెంది మరోసారి ప్రజలను భయపెడుతోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ ఈ వేరియంట్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతుండగా ఇటీవల భారత్లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ రోజు కొత్తగా ఏపీలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు…
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంప ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వేరియంట్ బయటపడ్డ 15 రోజుల్లోనే 66 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి కూడా ప్రవేశించింది. రోజురోజుకు చాపకింద నీరులా ఒక్కొక్క రాష్ట్రంపై ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోంది. అయితే…
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకున్న సందర్భంలో కొత్త కరోనా వేరింయట్ ఒమిక్రాన్తో మళ్లీ గతంలోని లాక్ డౌన్ లాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.తాజాగా ఒమిక్రాన్ వేరింయట్పై పలు ఆసక్తికర విషయాలను శాస్ర్తవేత్తలు బయటపెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్తో రీఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉందని జొహెన్స్బర్గ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. గతంలో ఇన్ఫెక్షన్ కారణంగా వెలువడిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకునే లక్షణం ఒమిక్రాన్కు ఉందని వారు…
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సంక్రమించింది. విజయనగరం జిల్లాలో రెండు దఫాలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంపారు అధికారులు. జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. దీంతో అలెర్ట్ అయింది…