ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కొందరు, ఆ తర్వాత మరి కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కానీ.... ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా మండలి ఛైర్మన్ ఆమోదం పొందలేదు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి బైబై చెప్పేశారు.
2024 ఎన్నికల్లో ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు. గెలుపు కోసం ఐదేళ్ళు ఎదురు చూసిన కొందరు పొత్తు ధర్మంలో భాగంగా అప్పటిదాకా తాము వర్కౌట్ చేసుకున్న సీట్లను జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. సర్దుకుపోవాల్సిందేనని పార్టీ పెద్దలు తెగేసి చెప్పడంతో టిడిపి సీనియర్లు సైతం నోరుమెదపలేకపోయారు అప్పట్లో. అంత వరకు ఓకే అనుకున్నా... ఆ తర్వాతే అసలు టెన్షన్ మొదలైందట. నాడు సీట్లు త్యాగాలు చేసిన వారికి తగిన గుర్తింపు…
ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట్లో కాస్త నత్త నడకన నడిచినా..... ఎప్పుడైతే...మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దానికి సంబంధించిన టిప్ ఇచ్చారో... ఆ తర్వాతి నుంచి ఇక దూకుడు పెంచింది సిట్. లిక్కర్ స్కాంలో కర్త.. కర్మ.. క్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పటం.. ఇక సిట్ అధికారులు ఆయనతో మొదలు పెట్టి భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వరకూ అరెస్టులు చేయటం…
ఆ ఇద్దరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే ఏంట్రీ పాస్ కావాల్సిందేనా? ఆ ఇద్దరు సీనియర్స్ ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారా? సీనియర్ మినిస్టర్స్ జూనియర్ ఎంపీలను తొక్కేస్తున్నారన్నది నిజమేనా? మరి ఎంపీలు కనీసం క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎవరా మంత్రులు, ఎంపీలు? జనం ఓట్లేసి గెలిపించారు. కానీ… ఇప్పుడు వాళ్ళకే దూరమైపోతున్నామంటూ తెగ ఫీలైపోతున్నారట నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గాల్లో అభివృద్ధి,…
తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి అటా.. ఇటా..? ఎటు? ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధంగాని గందరగోళంలో ఉన్నారా? ఏంటి….? అసలేంటి… మాకీ ఖర్మ అంటూ పార్టీ నాయకులు తలలు బాదుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీ లీడర్స్కు అంత కష్టం ఏమొచ్చింది? క్రాస్రోడ్స్లో ఉన్నట్టుగా ఎందుకు ఫీలవుతున్నారు? పూటకో మాట, రోజుకో రూల్ అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళకు వాళ్ళే రూల్స్ పెట్టుకుంటారు. పాటించకుండా నీరుగార్చేది కూడా వాళ్ళే. ఈ క్రమంలో తాజాగా…
ట్రబుల్ షూటర్.... ఈ మాట వినగానే..... కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్రావు. ఉద్యమ సమయంలో... కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్.
క్షవరం అయితే గానీ.... వివరం తెలియదని అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేవలం టింకరింగ్తో సరిపోదని, టాప్ టు బాటమ్ పార్టీని రీ స్ట్రక్చర్ చేయాలని అధిష్టానం డిసైడైందట.
రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.... ఏపీ బీజేపీ నాయకుల్లో ఆశలు మోసులెత్తాయి. ఇక పదవుల జాతరేననుకుంటూ చాలా మంది మురిసిపోయారట. కానీ... టైం గడిచేకొద్దీ... తత్వం బోధపడుతూ... ఆ ఏముందిలే అనే స్థాయికి వస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. తమ కోటాలో పదవులు దక్కడం సంగతి అలా ఉంచితే... వచ్చిన వాటిని ఇస్తున్న తీరు చూసి కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది…
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నయినా కూల్గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్ ముగింపు ఇచ్చే ఈటల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న ఎగ్రెసివ్ కామెంట్స్ నాలుగైదు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశం అవుతోంది.
సరిహద్దులో భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగినా.... బెజవాడలో బ్రదర్స్ వార్ మాత్రం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా పీక్స్కు చేరుతోంది. తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో... మేటర్ మాంఛి రసకందాయంలో పడింది.