Off the Record: ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అంతా దోచేస్తున్నారా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?
- ఆదోనిలో బీజేపీ, టీడీపీ నేతల తీరుపై తీవ్ర ఆరోపణలు..
- భూ కబ్జాలు, నెలవారీ మామూళ్ళు, రేషన్ అక్రమాలు..
- ఎమ్మెల్యే సమక్షంలోనే దళిత సర్పంచ్కు అవమానం..
- ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి..
- కొన్నాళ్ళు మీనాక్షి నాయుడు వర్సెస్ సారధి వివాదాలు..
- ఎమ్మెల్యే తమకు పనులు చేయడం లేదంటున్న టీడీపీ లీడర్స్ ..
- ఇసుక, ఫ్లయ్ యాష్ లారీలకు అనుచరుల బెదిరింపులు?..
- ఓ బీజేపీ నేత ఏకంగా సబ్ రిజిస్ట్రార్నే బెదిరించారా?..
- నెలకు రూ.8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారా?..
- పట్టుకున్న రేషన్ బియ్యం తెల్లారేసరికి మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off the Record: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పమవుతోంది. రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఒక ఎత్తయితే.., నియోజకవర్గంలో ఆయా నేతల అనుచరుల ఆగడాలు మరో ఎత్తు అంటున్నారు స్థానికులు. అరాచకాలు ఆధారాలతో లహా బహిర్గతం కావడం, భూ కబ్జాలాంటి ఆరోపణలు, నెలవారీ మామూళ్ల కోసం బెదిరింపులు, రేషన్ బియ్యం మాఫియా లాంటి రకరకాల అవలక్షణాలతో ఆదోనిలో కూటమి ప్రభ మసకబారిపోతోందని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలోనే దళిత సర్పంచ్కి అవమానం జరగడం, దళిత సంఘాల ఆందోళన చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడం వంటి వరుస వివాదాలు ఆదోని కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో… కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున విజయం సాధించారు పార్థసారధి. ఆ తర్వాతి నుంచి అసలు కథ మొదలైంది. ఆదోని సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ నేత మీనాక్షినాయుడుకు, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరూ పరస్పరం బహిరంగంగా విమర్శించుకోవడంతో మొదలైన గొడవలు మొన్నటి దళిత సర్పంచ్ కు అవమానం జరిగిన ఘటనతో పీక్స్కు చేరినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Off The Record: కవిత ఫోన్ కూడా ట్యాపింగ్? అందుకే కామ్గా ఉన్నారా?
Also Read
ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి టీడీపీ నేతలు, కార్యకర్తలకు పని చేయడం లేదని, వైసీపీ వర్గీయులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు మీనాక్షి నాయుడు. అందుకు ఎమ్మెల్యే కూడా ఘాటుగా రియాక్ట్ అవడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు ఇసుక లారీలు, ఫ్లైయాష్ లారీల యజమానులు బెదిరించిన ఘటనల ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్స్ నుంచి ట్రిప్పునకు ఇంత అని డిమాండ్ చేయడం, డ్రైవర్లను కొట్టి ఫోన్స్లాక్కోవడం లాంటివి బాగానే జరిగాయట. ఇక బీజేపీ నేత ఒకరు… ఏకంగా సబ్ రిజిస్ట్రార్ ను ఇంటికి పిలిపించి బెదిరించారన్న ఆరోపణలున్నాయి. నెలకు 8 లక్షలు ఇవ్వాలని ముందు డిమాండ్ చేసి.. ఆ తరువాత కాస్త తగ్గి రూ.4 లక్షల కోసం బెదిరించారట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారని, ఇపుడు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యే సన్నిహతులపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉండే డాక్టర్ కిరణ్… తన తల్లి పేరుతో రూ.2 కోట్లు విలువ చేసే ఇతరుల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఏకంగా ఆధార్ కార్డ్ మార్ఫింగ్ చేశారట. ఆ దెబ్బకు ఎమ్మెల్యేనే నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్లి…ఎవరైనా డబ్బులు అడిగినా… తేడా పనులు చేయమన్నా నాకు ఫోన్ చేయమని చెప్పాల్సి వచ్చిందంటున్నారు. ఆదోనిలోని ఓ ప్రైవేటు గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 వేల బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి గోడౌన్కి తాళం వేశారు అధికారులు.
Read Also: Kothwalguda Eco Park: త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కొత్వాల్గూడ ఎకో పార్క్..
అయితే మాఫియా తెల్లారేసరికల్లా… ఆ గోడౌన్ లో కేవలం 109 బస్తాల రేషన్ బియ్యం మాత్రమే ఉంచి మిగతా మొత్తాన్ని దాటేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదంతా టీడీపీ నేత కుటుంబసభ్యులు, ఒక బీజేపీ నేత అన్నది లోకల్ టాక్. ఇక తాజాగా ఆదోని మండలం దనాపురంలో సర్పంచ్ ను ఎమ్మెల్యే పార్థసారథి వేదికపైకి ఆహ్వానిస్తుండగా టీడీపీ మహిళా నేత గుడిసె కృష్ణమ్మ జోక్యం చేసుకొని అతను ఎస్సీ అని చెప్పడం, దీంతో సర్పంచ్ ను కింద నిల్చోమని ఎమ్మెల్యే అనడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి తనను దళితుడని అవమానించారంటూ… సర్పంచ్ చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత సర్పంచ్ బీజేపీలో ఉన్నా… అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ క్షమాపణ చెప్పినా కేసు మాత్రం ఆగలేదు. ఇలా… మొత్తంగా ఆదోని నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఇటు టీడీపీ, అటు బీజేపీకి మచ్చతెచ్చేవిగానే ఉంటున్నాయని అంటున్నారు స్థానికులు. రెండు పార్టీల అధిష్టానాలు ఎలా సెట్ చేస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!