Off The Record: ఏపీ బీజేపీ నేతలు మేధావులమంటూ ఢిల్లీ నేతల కళ్ళకు గంతలు కడుతున్నారా?
- ఏపీ బీజేపీలో మేథావులు విచ్చలవిడిగా ఉన్నారా?..
- స్వయంప్రకటిత మేథావులు మొత్తానికే ముంచేస్తారా?..
- మోడీ 11ఏళ్ళ పాలనపై మేథావులతో చర్చకు ఆదేశాలు..
- బీజేపీ లీడర్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని పైకి రిపోర్ట్..
- మేం మాత్రమే మేథావులమని అనుకుంటున్నారా అన్న డౌట్స్..
- ఓ హోటల్లో కూర్చుని లంచ్, డిన్నర్ మీటింగ్స్తో మమ..
- పదవులు లేవన్న అసంతృప్తితో మేథావుల అవతారం ఎత్తారా?..
- హోటల్లో కూర్చుని టైంపాస్ చేయడమే మేథోమధనమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అంతా మేథావులేనా? ఎ టు జడ్…, టాప్ టు బాటమ్…. ఒక్కరంటే ఒక్కరు కూడా సాధారణ నాయకుడు లేకుండా…. అంతా అపర మేథావులైపోయారా? అలా ట్యాగ్లైన్స్ తగిలించేసుకుని ఢిల్లీ నాయకత్వం కళ్ళకు గంతలు కడుతున్నారా? అసలిప్పుడీ మేథో చర్చ ఎందుకు మొదలైంది పార్టీలో? ఎవరికి వారు భుజకీర్తులు తగిలించుకు తిరగడానికి కారణాలేంటి?
Read Also: Off The Record: వైసీపీ నేత గోరంట్ల మాధవ్ సైలెంట్ అయ్యారా? చేసారా? మొత్తం ఆ వీడియోనే చేసిందా?
Also Read
ఏపీ బీజేపీలో నాయకుల తెలివితేటలు పెరిగిపోయి.. పొంగి పొర్లి.. డ్యాంలు కట్టినా ఆగకుండా బద్దలు కొట్టుకుని మరీ బయటికి ప్రవహించేస్తున్నాయా? అంటే.. వాస్తవం ఏంటో తెలియదుగానీ.. వాళ్ళు ఇస్తున్న బిల్డప్లు చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వీళ్ళ ముందు.. బిల్డప్ బాబాయ్లు కూడా ఎందుకూ పనికిరారని చెప్పుకుంటున్నారు. పార్టీలో స్వయంప్రకటిత మేథావులు పెరిగిపోయి మొత్తానికే ముంచేలా ఉన్నారన్న భయాలు కూడా ఉన్నాయట కేడర్లో. ఇంతకీ, అసలు విషయం ఏంటంటే.. మోడీ 11 ఏళ్ళ పాలన మీద రాష్ట్రమంతటా విస్తృతంగా చర్చ పెట్టాలని, ఇందులో మేథావుల్ని ఇన్వాల్వ్ చేయమని ఆదేశించిందట పార్టీ ఢిల్లీ నాయకత్వం. ఆ చర్చల సారాంశాన్ని మాకు పంపమని కూడా హైకమాండ్ పెద్దలు చెప్పినట్టు తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్లో మేథావులు దొరకలేదో, లేక వాళ్ళు వీళ్ళు ఎందుకు? అసలు రాష్ట్రంలో మనకంటే మేథావులు ఎవరున్నారని అనుకున్నారోగానీ.. ఏపీ బీజేపీ లీడర్స్ అంతా..తమలో తాము మోడీ 11ఏళ్ళ పాలనపై మాట్లాడేసుకుని, ఆహా ఓహో అనేసుకుని, అదే రిపోర్ట్ కాపీని ఢిల్లీకి టపాలో వేసేస్తున్నారట. పార్టీ నాయకులే మొక్కుబడి తంతు జరిపి.. మమ అనిపించేయడం చూసి కాషాయ కేడర్ ముక్కున వేలేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?
అయితే, సమాజాన్ని ప్రభావితం చేసే, తమ ముద్ర గట్టిగా వేయగలిగిన ప్రభావశీలుర్ని వెదికి చర్చలు జరిపి.. ఫీల్గుడ్ తీసుకురమ్మని ఢిల్లీ పెద్దలు చెబితే…. వీళ్ళు మాత్రం మేమే మేథావులం, మాకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకోవడం ఏంటో అర్ధం కావడంలేదని కేడర్లో గుసగుసలు పెరిగిపోతున్నాయట. ఎన్టీఆర్ జిల్లా లాంటి చోట్ల అయితే… జిల్లా స్థాయి నేతలంతా ఒక హోటల్లో కూర్చుని లంచ్ మీటింగో, డిన్నర్ మీటింగో పెట్టుకుని చర్చలు జరిగాయని అనిపించేసినట్టు తెలిసింది. ఎందుకలా చేస్తున్నారు? పార్టీ విషయంలో సరిగా ఎందుకు దృష్టి పెట్టడం లేదంటే…. పదవుల పరమైన అసంతృప్తి ఉందన్నది ఇంటర్నల్ టాక్. ఇక జిల్లా అధ్యక్షులే… మేథావుల్లా ఫీలైపోతూ… చర్చలు ముగించేస్తున్నట్టు సమాచారం. దీంతో… అసలు వీళ్ళంతా చర్చల సారాంశాన్ని ఏమని అధిష్టానానికి నివేదిస్తున్నారన్న డౌట్ ఉందంటున్నారు కొందరు నాయకులు. క్షేత్రస్ధాయి బలోపేతం దిశగా మేధావులతో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వమంటే…. జిల్లా నాయకులు దాన్ని కూడా గంగలో కలిపేస్తున్నారన్న అసంతృప్తి రాష్ట్ర పార్టీ ఆఫీస్లో వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. పదవులు రాక, నిరాశతోనే… జిల్లాల్లో ఎవరికి వారు మేథావుల అవతారం ఎత్తారా అన్న సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. పదవులు ఎలాగూ లేవు.. ఈ రకంగా అయినా ఆత్మసంతృప్తి పొందుతున్నారనే చర్చ జరుగుతోంది. ఏదో ఒక హోటల్లో కార్యక్రమం పేరుతో టైంపాస్ చేయడమే మేథావితనమని అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. మొత్తం మీద ఏపీ బీజేపీలో మేథోమధన చర్చలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..