Off The Record: వైసీపీ అధిష్టానం చెప్పినా ఆ ఇద్దరి నేతల మధ్య వైరం ఆగట్లేదా..?
- జమ్మలమడుగు వైసీపీలో ఢీ అంటే ఢీ..
- 2019 ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేగా సుధీర్రెడ్డి గెలుపు..
- రామసుబ్బారెడ్డి పార్టీ మారాక మొదలైన రగడ..
- ఎప్పటికప్పుడు పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నా నో యూజ్..
- చెప్పిన రోజు తలూపేసి మరుసటి రోజు నుంచి మామూలే..
- 2024లో సుధీర్రెడ్డి ఓడిపోయాక రామసుబ్బారెడ్డి దూకుడు..
- నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి సొంత ఆఫీస్..
- చెరో మూడు మండలాలు విభజించి ఇచ్చిన అధిష్టానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలే ఎప్పుడూ మండుతూ ఉంటాయనుకుంటే… అందులోనూ జమ్మలమడుగుకు ఇంకా మంటెక్కువ. ఫ్యాక్షన్ పాలిటిక్స్కు కేరాఫ్ ఇది. అయితే… మొన్నటివరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా… ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతల తీరేంటో అర్ధంగాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతం అవుతున్నట్టు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి. అయితే కాస్త అటు ఇటుగా అదే టైంలో…. నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక అక్కడి నుంచి రగడ మొదలైందట. మెల్లిగా ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ… వైసీపీలో కొనసాగుతున్నా… ఆ సోయి లేకుండా… ప్రత్యర్థుల్లాగా పోట్లాడుకున్న సందర్భాలున్నాయి. ఒక దశలో రామసుబ్బారెడ్డి వర్గంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు నేరుగా దాడులు చేశారు అప్పట్లో. ఇది ఇలాగే కొనసాగితే… నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తేడా పడుతుందని గ్రహించిన వైసీపీ పెద్దలు రాజీ ప్రయత్నం చేశారు.
Read Also: Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
అయితే… వాళ్ళు సర్ది చెప్పిన రోజు సైలెంట్గా ఉంటూ, మరుసటి రోజు నుంచి షరా మామూలే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఈ పరిస్థితుల్లోనే…. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు వైసిపి అభ్యర్థిగా సుధీర్ రెడ్డి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాతి నుంచి రామసుబ్బారెడ్డి దూకుడు పెంచారట. అప్పుడంటే… సుధీర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కామ్గా ఉన్నాను.. ఇక ఇప్పుడు మనకు అడ్డేముందని ఆయన సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే… నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ ఉండగా… సొంతగా మరో ఆఫీస్ ప్రారంభించారు ఎమ్మెల్సీ. వ్యవహారం మరీ ముదిరిపోవడంతో… మరోసారి రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నియోజకవర్గంలోని మొత్తం ఆరు మండలాలను సగం సగం విభజించి చెరో మూడు మండలాలు అప్పగించి ఎవరి పని వాళ్ళని చేసుకోమన్నారట. అయినా… నో యూజ్. ఎవరి పని వాళ్ళు చేసుకునే సంగతి పక్కనపెడితే…. వివాదం ఇంకా ముదిరిందన్నది లోకల్ టాక్. ఏడాది క్రితం వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని విభజించి సగం మరో నేతకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి. అందుకే… రామసుబ్బారెడ్డికి అప్పచెప్పిన జమ్మలమడుగు పట్టణానికి ఈ మధ్య తరచూ వస్తూ… తన కార్యాలయంలో కూర్చుని స్థానిక నేతలతో మీటింగ్స్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట..
అంతేకాకుండా…. రామసుబ్బారెడ్డికి అప్పగించిన మూడు మండలాలను తిరిగి తన పరిధిలోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే. అందుకే… తన పరిధిలోని వాటిని వదిలేసి మిగతా మూడు మండలాల్లో తరచూ తిరుగుతూ… స్థానిక నేతల్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తల్ని ఇరకాటంలో పడేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వెనక నడవాలో అర్ధంకాక తలలు బాదుకుంటోందట కేడర్. వాళ్ళంతా… సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు రామసుబ్బారెడ్డిని విమర్శించడం, అలాగే రామసుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు సుధీర్ రెడ్డిని విమర్శించడం అలవాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తుంటే…. ఎక్కువ మంది మాత్రం ఇబ్బందిగా ఫీలవుతున్నారట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పుకుంటున్న క్రమంలో… ఇదెక్కడి పరిస్థితిరా.. దేవుడా, వీళ్ళిద్దరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని మొత్తానికే ముంచేస్తారా అని కార్యకర్తలు కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డికి చెక్ పెట్టడానికే మాజీ ఎమ్మెల్యే రూట్ మార్చారన్నది ఇంకో టాక్. ఎవరు ఎవరికి చెక్ పెట్టుకున్నా… అంతిమంగా అది పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపుతోందన్నది జమ్మలమడుగు వైసీపీ కేడర్ బాధ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
-
Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
-
CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..