ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులను గుర్తించారు. దీంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇక ఒడిశాలో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే 210 కి పైగా కేసులు నమోదయ్యాయి.…
Norman Borlaug Award to Indian Scientist Dr. Swati nayak: భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది అందించే నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు స్వాతి. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా ఉన్నారు. నార్మన్ ఇ బోర్లాగ్ అవార్డ్ ఫర్ ఫీల్డ్ రీసెర్చ్ అండ్…
Scrub Typhus: ఒడిశా రాష్ట్రాన్ని ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా సుందర్ఘర్ జిల్లాలో మరో 11 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా 59 శాంపిళ్లను పంపించగా 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది. ఎక్కువగా కేసులన్నీ సుందర్ఘర్ జిల్లాలో నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు.
దేశంలోని ప్రధాన ఆలయాలలో పూరీ జగన్నాథ్ ఒకటి. అయితే ఆ ఆలయంలో స్వామి సేవ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిచిపోయాయి. ఉదయం 8.30 గంటలకు మొదటి నైవేద్యాన్ని సమర్పించవల్సి ఉండగా.. సాయంత్రం 5.30 గంటలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు.
Odisha: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరదలు, వర్షాల కారణంగా విధ్వంసం నెలకొంది. హిమాచల్లో ప్రతికూల వాతావరణం గరిష్ట ప్రభావాన్ని చూపింది. ఇక్కడ చాలా మంది మరణించారు.
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గత 24 గంటల్లో వర్షాలు దంచికొట్టాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జనాభా పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయంలో తమ టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ఓ ఆశావర్కర్ దారుణానికి పాల్పడింది. పెన్షన్ ఇప్పిస్తానని ఒక మూగ యువకుడిని తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. అతని తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల ప్రకారం గాంగదురువ అనే 26 యేళ్ల యువకుడు ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్…