ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గత 24 గంటల్లో వర్షాలు దంచికొట్టాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జనాభా పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయంలో తమ టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ఓ ఆశావర్కర్ దారుణానికి పాల్పడింది. పెన్షన్ ఇప్పిస్తానని ఒక మూగ యువకుడిని తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. అతని తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల ప్రకారం గాంగదురువ అనే 26 యేళ్ల యువకుడు ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్…
ఒడిశాలో వర్షంతో పాటు పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 29 మృతదేహాలను గుర్తించలేదు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తుంది. జూన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోయారు.
Old Love Marriage in Odisha Goes Viral: ‘ప్రేమ’ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం, ఆస్తి మరియు అంతస్తుతో సంబంధం లేదు. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా, ఏ వయసులో వారైనా ప్రేమలో ఇట్టే పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని, రెండు మనస్సులు కలిస్తే చాలని ఒడిశాలోని ఇద్దరు లేటు ప్రేమికులు నిరూపించారు. 76 ఏళ్ల వయస్సు ఓ వృద్ధుడు.. 47 వయస్సున్న మహిళ ఎనిమిదేళ్లుగా ప్రేమలో…
Husband Dones Wife Marriage With Her Boyfriend In Odisha: సినిమాల ప్రభావం జనాలపై బాగానే ఉంది. అచ్చం ‘కన్యాదానం’ సినిమాలో మాదిరి ఓ ఘటన రిపీట్ అయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1998లో విడుదలైన కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్.. తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అచ్చు ఇలాంటి ఘటనే రియల్గా జరిగింది. ఓ భర్త తన భార్య ప్రేమించిన వాడితో అన్నీ తానై మరీ పెళ్లి…
బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది.
నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిషాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది.