Scrub Typhus: మహారాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం… రాష్ట్రంలో ప్రవేశించిన స్క్రబ్ టైఫస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులను గుర్తించారు. దీంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇక ఒడిశాలో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే 210 కి పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 5 మందికి ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్గా మారింది.
Also Read: Mutual Funds: త్వరగా కోటీశ్వరులు కావాలనుకుంటే.. ఈ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి
Also Read
కేవలం ఒడిశాలోనే కాకుండా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోకూడా మరో ఐదుగురు చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్ ఎలా వస్తుంది, లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే స్క్రబ్ టైఫస్.. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. ఈ బ్యాక్టిరియా సోకిన పురుగు కుట్టడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని పేర్కొంది. దీనిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే పురుగు కుట్టిన పది రోజుల తర్వాత వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. దీని కారణంగా అప్పటికే వైరస్ మొత్తం వ్యాపిస్తుంది. ఇది హెపటిటిస్ కు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ హెమరేజ్, హైపోవోలెమియాకు దారితీయొచ్చు. ఇక వీటి లక్షణాల విషయానికి వస్తే ప్రధానంగా జ్వరం, తలనొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పాటు కొంతమందిలో దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. వీలైనంత త్వరగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కామన్ గా కొండ ప్రాంతల్లో, పొదల్లో ఉండే పేలు లాంటి పురుగులు ద్వారా వస్తాయి.
- Tags
- maharastra
- Odisha
- scrub typhus
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!