ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్పూర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సదాశివ్ ప్రధాని, ఆయన కుటుంబాన్ని భత్రా (Bhatra / Bhatara) సమాజం బహిష్కరించింది. ఇది ఆయన కుమార్తె ఇంటర్-క్యాస్ట్ (inter-caste) వివాహం కారణంగా జరిగింది. మార్చి 21, 2026న దబుగావోన్, ఝరిగావోన్ ప్రాంతాల్లో భత్రా సమాజ నాయకులు సమావేశమై, ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాజ నిబంధనలకు విరుద్ధంగా కుమార్తె వివాహం జరిపించడం వల్ల ఇలాంటి చర్య తీసుకున్నట్లు వారు ఆరోపించారు. Also Read:Redmi Smart TV MAX:…
Cuttack Hospital Fire Accident: ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో చెలరేగిన ఈ మంటల్లో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం ప్రకారం ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే అక్కడ పొగ దట్టంగా వ్యాపించడంతో రోగులను బయటకు తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా…
గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప రేంజ్లో స్కెచ్లు వేసి మరీ దందా చేస్తున్నారు. వేలు కాదు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయల గంజాయిని సరిహద్దులు.. అవసరమైతే దేశాలు దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి దందా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Bride Kidnapped: ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన వధువు, తన భర్తతో కలిసి అత్తారింటిక వెళ్తుంటే, తలకు గన్ గురి పెట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి వధువు మాజీ ప్రేమికుడిగా తేలింది. బోలంగీర్ జిల్లా నివాసి, వరుడు హరిబంధు పటేల్ వివాహం కోసం కాంటమల్కు వెళ్లాడు. వివాహం ముగిసిన తర్వాత, వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి వాహణాన్ని…
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధుల్లో ఉన్న ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రైలర్ పోలీసు వాహనాన్ని బొలెరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ ముందు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీఆర్ పోలీసులు కాశీరామ్ భోయ్, దేబ్దత్ సా, డ్రిల్ సబ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ కుజుర్, ఏపీఆర్ హవల్దార్ లింగరాజ్ ధురువా,…
కవల పిల్లల్లో పోలికలు ఒకే తీరుగా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పా మిగతా వారు గుర్తు పట్టలేకపోతుంటారు. ట్విన్స్ పోలికల్లోనే కాదు దాదాపు టాలెంట్ లో కూడా ఒకేలా ఉంటుంటారు. ఇలాగే ఓ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ జేఈఈ మెయిన్స్ లో అద్భుతమైన ప్రతిభకనబర్చారు. కవల సోదరులు కవల మార్కులు సాధించారు. ఏకంగా 100 పర్సంటైల్ తో అదరగొట్టారు. ఈ సంవత్సరం, IITలు సహా దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష అయిన JEE మెయిన్…
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఫిబ్రవరి 3, 2026 మంగళవారం నాడు ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (SFDR) టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో, భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపిక చేయబడిన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది. ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. Also Read:India-US Trade deal:…
Chips Packet: చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చిప్స్ ప్యాకెట్లు కొనిపెట్టడం సహజం. కొనాలని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి కూడా ప్రాణాలు తీస్తాయని ఈ ఘటన హెచ్చరించింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్లో వచ్చిన మినియేచర్ బొమ్మను మింగడంతో నాలుగేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు.
ఒడిశాలోని జాజ్పూర్లో కీటకాల గుంపు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద ఎత్తున కీటకాల దండు తరలిరావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్లల్లో పడడంతో బైకర్లు బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Reel On Track: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలను తీస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని, వ్యూస్, సబ్స్క్రైబర్లను పెంచుకోవాలనే పిచ్చి కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా మరణించాడు. ఒడిశాలోని పూరిలోని రైల్వే ట్రాక్పై రీల్ షూట్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొని మరణించాడు.