Telangana: రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ..
- మూడు నెలల రేషన్ ఏప్రిల్లోనే పంపిణీ..
- తెలంగాణ లబ్ధిదారులకు ఒకేసారి 18 కిలోల చొప్పున సన్నబియ్యం..
- సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రాబోయే వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. పేద ప్రజలు ప్రతి నెలా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారంలోనే భానుడి భగభగలు మొదలవ్వడం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ ముందస్తు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో ఉన్న సుమారు ఒక కోటి మూడు లక్షల ఆహార భద్రత కార్డుదారులకు భారీ ఉపశమనం కలగనుంది.
Read Also:Bonus: మాకూ ఇలాంటి బాసే కావాలి.. ఉద్యోగులకు రూ. 240 కోట్ల బోనస్ను పంపిణీ చేసిన యజమాని
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున అత్యంత నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇప్పుడు కేంద్రం సూచన మేరకు మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తే.. ఒక్కో వ్యక్తికి ఏకంగా 18 కిలోల సన్నబియ్యం చేతికి అందుతాయి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి సుమారు 72 కిలోల బియ్యం ఒకే దఫాలో లభిస్తాయి. దీనివల్ల వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి లేదా ఎండల వల్ల బయటకు రాలేని వారికి ఆహార ధాన్యాల కొరత లేకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. అయితే ఈ భారీ మొత్తంలో బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అవసరమైన నిల్వలు, రవాణా సౌకర్యాలపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం లోతుగా సమీక్షిస్తోంది.
Read Also:Israel: ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాం.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్..
గత ఏడాది వర్షాకాలంలో ఇలాగే మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇచ్చినప్పుడు రేషన్ డీలర్లు , లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా రేషన్ దుకాణాల్లో మూడు నెలల స్టాక్ను భద్రపరచడానికి సరిపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు.. బయోమెట్రిక్ విధానంలో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారులు ఈ-పోస్ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడానికి 15 నుండి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది దుకాణాల వద్ద రద్దీకి దారితీయవచ్చు. ఈ సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్డేట్స్, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడం, హమాలీలకు పని భారం తగ్గడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఏప్రిల్ నెలలోనే పేద కుటుంబాల ఇళ్లలో బియ్యం నిల్వలు నిండుగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్, పంపిణీ తేదీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!