Scrub Typhus: ఒడిశాను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. కొత్తగా 11 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scrub Typhus: ఒడిశా రాష్ట్రాన్ని ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా సుందర్ఘర్ జిల్లాలో మరో 11 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా 59 శాంపిళ్లను పంపించగా 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది. ఎక్కువగా కేసులన్నీ సుందర్ఘర్ జిల్లాలో నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు.
జిల్లాలో శనివారం ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ సోకిన కీటకాలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. కాటు వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. బార్గర్ జిల్లాలో 6 మంది చనిపోగా.. ఒకరు సుందర్ఘర్ జిల్లాలో చనిపోయారు. ఇదిలా ఉంటే పరిస్థితిని సమీక్షించడానికి ఆరోగ్యశాక శనివారం బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నుంచి ముగ్గురు సభ్యుల బృందాన్ని బర్ఘర్ జిల్లాకు పంపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Dabur: రోజుకు 2.4 కోట్ల హజ్మోలా తింటున్న ఇండియన్స్.. రూ.కోట్లు సంపాదిస్తున్న డాబర్
వ్యవసాయ భూములు, అడువులను తరుచుగా సందర్శించే వ్యక్తులు ఈ వ్యాధికి గురవుతున్నారు. స్క్రబ్ టైఫస్ అనే జ్వరాన్ని పట్టించుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధి ముదిరితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీయవచ్చు. దీంతో రోగి మరణిస్తారు. సాధారణంగా పొదలు, అడవులకు, జంతువులకు దగ్గరగా నివసించే వారు పేలు వంటి కీలకాల కాటు వల్ల ఈ వ్యాధికి గురవుతారు. దీని బారిన పడుతున్న వారిలో పిల్లలు, వృద్దులే ఎక్కువగా ఉంటున్నారు. క్రిమి కాటు వల్ల ఏర్పడే మచ్చ ఈ వ్యాధికి ఒక సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధికి గురైతే డెంగ్యూ మాదిరిగానే శరీరంపై దద్దర్లు వస్తాయి. జీర్ణ సమస్యలు, జ్వరం, కొందరిలో శ్వాస సమస్యలు వస్తాయి. వెంటిలేటర్, ఐసీయూ సౌకర్యాలు రోగికి చాలా అవసరం. సకాలంలో ట్రీట్మెంట్ అందకపోతే రోగి మరణించవచ్చు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..