Road Accident: ఒడిశాలో ట్రక్కును ఢీకొన్న బస్సు.. 21 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై బాలాసోర్ సదర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) శశాంక శేఖర్ బ్యూరా మాట్లాడుతూ.. ఒక దాబా సమీపంలో నిలబడి ఉన్న ట్రక్కును ఉదయం 5 గంటల ప్రాంతంలో టూరిస్ట్ బస్సు ఢీకొట్టిందని తెలిపారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న నేపాల్ కు చెందిన 20 మంది యాత్రికులు సహా 21 మందికి గాయాలయ్యాయి.
Read Also: Rajasthan News: నిద్రపోతున్న తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న.. పంట విషయంలో ఘర్షణ
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
గాయపడిన వారందరినీ సోరో ఆసుపత్రికి తరలించామని, నేపాల్ యాత్రికులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అయితే బస్సు డ్రైవర్ పరిస్థితి విషమించడంతో బాలసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు SDPO తెలిపారు. టూరిస్ట్ బస్సు ఉత్తరప్రదేశ్కు చెందినదని, డ్రైవర్ కూడా ఆ రాష్ట్రానికి చెందినవాడని పోలీసు అధికారి తెలిపారు. అయితే గాయపడ్డ వారికి ఆహారం, నీటి ఏర్పాట్లు చేసి వారిని గమ్యస్థానానికి పంపించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే టూరిస్ట్ లు జగన్నాథుని దర్శనం కోసం పూరీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని యాత్రికులు చెబుతున్నారు.
Read Also: IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
- Tags
- bus
- injure
- Odisha
- people
- road accident
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?