తానొకటి అనుకుంటే… పైవాడు ఇంకోటి తలచాడన్నట్టుగా ఉంది ఆ సీనియర్ లీడర్ పరిస్థితి. చివరిదాకా టిక్కెట్ నాదేనని అనుకున్నారాయన. టీడీపీ పెద్దలు కూడా అదే భ్రమలో ఉంచారు. లాస్ట్ మినిట్లో తగిలిన షాక్కు గింగిరాలు తిరిగిన ఆ మాజీ ఎమ్మెల్యే వెంటనే తేరుకుని నట్లన్నీ బిగించేశారు. ఇప్పుడు పార్టీ పెద్దలు ఓపెన్ చేద్దామన్నా వీలుకానంత గట్టిగా బిగుసుకుపోయింది వ్యవహారం. ఇంతకీ ఎవరా లీడర్? ఏంటాయన టిక్కెట్ వ్యవహారం? అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశానికి కొన్ని చోట్ల…
తుపాకీ తూటా….మనిషి మాట….ఒక్కసారి బయటకు వచ్చాయంటే చెయ్యాల్సిన నష్టం చేసేస్తాయి. రాజకీయాల్లోనైతే ఒక్కోసారి ఆ మాట చేసే నష్టం ఊహకు అందదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఓ మాట తూటాలా పేలింది. ఒకరికి అది బౌన్సర్ గా మారితే…మరొకరికి బౌన్స్ బ్యాక్ గా ఫుల్ పబ్లిసిటీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎన్నికల సమయం. మాటే తూటా. ఒక్కోసారి ఆ మాటల తూటా రివర్స్ అయి మనకే తగులుతుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి…
అక్కడ ఆయన…ఇక్కడ ఈయన. ఫేటు మారుస్తాయన్న కాన్ఫిడెన్స్ తో చేస్తున్న లేటు వయస్సు…ఘాటు రాజకీయాలు హాట్ హాట్ డిస్కషన్ గా మారాయి. రాజకీయ చరమాంకంలో ఆ ఇద్దరి అడుగులు ఎటువైపు అంటూ అనుచరులే తెగ మాట్లాడుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య….కడియం శ్రీహరి….దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నవారే. ఇద్దరూ వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు. వీరి రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా మారిపోయాయి. లక్ష్మయ్య నాలుగు టర్మ్ లు, కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి 2023 ఎన్నికలు…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో.. ఆ జిల్లా నేతలు కొత్త నినాదం అందుకున్నారు. తాను గెలిస్తే.. ఆ పదవి ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. మేమే అధికారంలోకి వస్తున్నాం, ఎంపీ సీటును మాకిస్తే.. మీకో గ్యారెంటీ ఇస్తామంటున్నారు. ఇంతకీ ఏంటా గ్యారెంటీ..? నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్ధులుగా తలపడుతున్నారు.…
ధర్మవరం సీటు రాకపోయినా…టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ సంతోషంగా ఉన్నారా ? పొత్తుల్లో భాగంగా ధర్మవరం బీజేపీకి వెళ్లిపోయినా సత్యకుమార్ కు అండగా ఉంటానని చెప్పడం వెనక మతలబు ఏమైనా వుందా? తనకు రాకపోయినా పర్వాలేదు…తన శత్రువుకు మాత్రం రాకూడదన్నదే శ్రీరామ్ లక్ష్యమా ? లేదంటే అంతకు మించిన స్ట్రాటజీ వుందా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సుదీర్ఘ అనుబంధమున్న పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్…
నిర్మల్ రాజకీయాలను భూకబ్జాల బాగోతం హీటెక్కిస్తోంది. భూ ఆక్రమణలు నిరూపిస్తానంటూ మాజీ మంత్రిపై తాజా ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల పర్వం కొత్తకొత్త మలుపులు తిరుగుతోంది. ఇంతకీ భూకబ్జా ఆరోపణల పంతంలో నెగ్గేదెవరు? తగ్గేదెవరు? నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కబ్జాల ముచ్చట కాకరేపుతోంది. ఎక్కడ విన్నా కబ్జాలు..దానిపై లోకల్ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలపై చర్చవినిపిస్తోంది. ఎంపీ ఎన్నికల కంటే ముందు రాజకీయంగా రచ్చకు దారితీస్తుండగా , కబ్జాల కథ తేల్చాలంటూ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారంటా…నిర్మల్ కు…
ఆ నియోజకవర్గంలో టిక్కెట్టు రాక అసంతృప్తితో ఉన్న ఆ టీడీపీ నేత కూటమి కొంప ముంచుతాడా? సీట్ రాని వాళ్లు రెండ్రోజులు అరిచి సైలెంట్ అవుతుంటే ఆ నేత మాత్రం ఎందుకు దారికి రావడం లేదు…? ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు రంగంలోకి దిగాయి…? అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. పొత్తులో భాగంగా సీటును బీజేపీకి వదులుకోవాల్సి రావడంతో అలకపాన్పు ఎక్కిన నల్లమిల్లి… పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేనా… నాకు అన్యాయం జరిగింది అంటూ…
కడియం స్ట్రోక్ నుంచి బీఆర్ఎస్ తేరుకుందా? వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేయబోతోంది? ఇప్పుడు కొత్తగా తెర మీదికి వస్తున్న ఈక్వేషన్స్ ఏంటి? పార్టీ పరిశీలిస్తున్న పేర్లేవి? సామాజిక సమీకరణల లెక్కలు ఎలా ఉన్నాయి? మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తిరిగి పార్టీలోకి వస్తారన్నది నిజమేనా? కడియం ఫ్యామిలీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో మైండ్ బ్లాంక్ అయిన బీఆర్ఎస్… మెల్లిగా తేరుకుని వరంగల్ అభ్యర్థి ఎంపిక మీద దృష్టి పెడుతోందట. కడియం శ్రీహరి కుమార్తె కావ్య…
అక్కడ కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ పట్టుకుందట. టిక్కెట్ దక్కని వారి మద్దతు ఉంటుందా లేక మేడిపండు మాదిరిగా అవుతుందా అని నిద్రాహారాలు మానేసి ఆందోళన పడుతున్నారట. పైకి సరేనంటున్నా… ఎక్కడ ఏ రూపంలో జర్క్ ఇస్తారోనంటూ గూఢచారులను కూడా పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడుందా వాతావరణం? అభ్యర్థులకు అంత భయం ఎందుకు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి అభ్యర్ధుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంటుందట. సీటు సాధించిన ఆనందం కంటే రాకుండా పోయిన వారి అలకలు కంటిమీద కునుకు…
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలకపాన్పు ఎక్కేశారా? కీలకమైన ఎన్నికల టైంలో ఆయన కనిపించడం లేదు ఎందుకు? హైదరాబాద్ అభ్యర్థి ఎంపికపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? లేక శాసనసభా పక్ష నేతగా తనను ఎంపిక చేయలేదన్న అసహనమా? అసలాయన విషయమై బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా ఓడిపోయినా… గెలిచిన ఒకే ఒక్కడు రాజాసింగ్. తాజా…