PM Modi: విపక్షాలు ఓడిపోయాయి.. 2019 రికార్డుల్ని ఈ ఎన్నికలు తుడిచిపెడతాయి..
PM Modi: తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు దశల్లో జరిగి ఎన్నికల్లో ముగిసినా, కొందరు వ్యక్తులు ఇంకా ఓటింగ్ లెక్కల్లోనే ఇరుక్కుపోయారని అన్నారు. తాను ఈ ఎన్నికలను అర్థమేటిక్ కన్నా కూడా కెమిస్ట్రీగానే చూస్తున్నానని చెప్పారు. కెమిస్ట్రీ చాలా శక్తివంతమైందని, ఫలితాన్ని చూపుతుందని చెప్పారు. తొలి దశలోనే విపక్షాల కూటమి ఓడిపోయిందని అన్నారు. రెండో దశలో అది కూలిపోయిందని, మూడో దశలో వాళ్లు నేలకొరిగారని ప్రధాని అన్నారు. బీజేపీపై ప్రజలకు చాలా విశ్వాసం ఉందని అన్నారు.
Read Also: Pakisthan: బలూచిస్థాన్లో గుర్తుతెలియని ముష్కరులు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు హతం
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
ఈ మూడు దశల్లో ర్యాలీలు, రోడ్ షోలు చేశానని, మీడియాతో మాట్లాడానని, 2014, 2019 ఎన్నికల్ని చూశానని, చాలా మంది ప్రజలు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రజలు ఇప్పుడు ఉత్సాహంగా పాలుపంచుకున్నారని ప్రధాని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓ భక్తి భావ వాతావరణాన్ని చూస్తున్నానని, దేశమంటే భక్తి, సమాజం అంటే భక్తి కనిపిస్తోందని, సమాజ నిర్మాణం కనిపిస్తోందని, రాజకీయ చైతన్యం కిందిస్థాయి నుంచి కనిపిస్తోందని అన్నారు. 2019 రికార్డులను ఈ ఎన్నికలు తుడిచిపెడుతాయని, మా గెలుపు మార్జిన్ మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇండి కూటమి ఆపసోపాలు పడుతోందని, తక్కువ ర్యాలీలు చేసిందని అన్నారు. కేరళలో ఇండీ కూటమి పరిస్థితి విచిత్రంగా ఉందని, అక్కడ ఇండీ కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ప్త్రత్యర్థులుగా ఉన్నాయని అన్నారు. ఆఖరి వరకు సీట్లు డిసైడ్ కాలేదని,క్యాంపెయిన్ థీమ్ కూడా లేదని, మోడీడి తిట్టడం రోజూ జరిగేదే అని, ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. మొత్తంగా ఇండియా కూటమి తీరు దయనీయంగా ఉందని అన్నారు.
కూటమి తీరు చూస్తుంటే ఒకసారి ఈసీపై ఫిర్యాదు చేస్తారు. మరోసారి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తారు, మరోసారి ఓటింగ్ లెక్కలపై గొడవలు చేస్తారని, వాళ్లకి క్యాంపెయిన్లపై ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు. దీంతో ఓడితే ఎవరిని తప్పుపట్టాలనే దానిపై దృష్టిపెడుతున్నారని అన్నారు. ఈవీఎంలను నిందించాలా..? లేక భాగస్వామ్య పక్షాలను తప్పుపట్టాలా అని ఆలోచిస్తున్నారని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!