PM Modi: విపక్షాలు ఓడిపోయాయి.. 2019 రికార్డుల్ని ఈ ఎన్నికలు తుడిచిపెడతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు దశల్లో జరిగి ఎన్నికల్లో ముగిసినా, కొందరు వ్యక్తులు ఇంకా ఓటింగ్ లెక్కల్లోనే ఇరుక్కుపోయారని అన్నారు. తాను ఈ ఎన్నికలను అర్థమేటిక్ కన్నా కూడా కెమిస్ట్రీగానే చూస్తున్నానని చెప్పారు. కెమిస్ట్రీ చాలా శక్తివంతమైందని, ఫలితాన్ని చూపుతుందని చెప్పారు. తొలి దశలోనే విపక్షాల కూటమి ఓడిపోయిందని అన్నారు. రెండో దశలో అది కూలిపోయిందని, మూడో దశలో వాళ్లు నేలకొరిగారని ప్రధాని అన్నారు. బీజేపీపై ప్రజలకు చాలా విశ్వాసం ఉందని అన్నారు.
Read Also: Pakisthan: బలూచిస్థాన్లో గుర్తుతెలియని ముష్కరులు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు హతం
Also Read
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఈ మూడు దశల్లో ర్యాలీలు, రోడ్ షోలు చేశానని, మీడియాతో మాట్లాడానని, 2014, 2019 ఎన్నికల్ని చూశానని, చాలా మంది ప్రజలు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రజలు ఇప్పుడు ఉత్సాహంగా పాలుపంచుకున్నారని ప్రధాని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓ భక్తి భావ వాతావరణాన్ని చూస్తున్నానని, దేశమంటే భక్తి, సమాజం అంటే భక్తి కనిపిస్తోందని, సమాజ నిర్మాణం కనిపిస్తోందని, రాజకీయ చైతన్యం కిందిస్థాయి నుంచి కనిపిస్తోందని అన్నారు. 2019 రికార్డులను ఈ ఎన్నికలు తుడిచిపెడుతాయని, మా గెలుపు మార్జిన్ మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇండి కూటమి ఆపసోపాలు పడుతోందని, తక్కువ ర్యాలీలు చేసిందని అన్నారు. కేరళలో ఇండీ కూటమి పరిస్థితి విచిత్రంగా ఉందని, అక్కడ ఇండీ కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ప్త్రత్యర్థులుగా ఉన్నాయని అన్నారు. ఆఖరి వరకు సీట్లు డిసైడ్ కాలేదని,క్యాంపెయిన్ థీమ్ కూడా లేదని, మోడీడి తిట్టడం రోజూ జరిగేదే అని, ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. మొత్తంగా ఇండియా కూటమి తీరు దయనీయంగా ఉందని అన్నారు.
కూటమి తీరు చూస్తుంటే ఒకసారి ఈసీపై ఫిర్యాదు చేస్తారు. మరోసారి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తారు, మరోసారి ఓటింగ్ లెక్కలపై గొడవలు చేస్తారని, వాళ్లకి క్యాంపెయిన్లపై ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు. దీంతో ఓడితే ఎవరిని తప్పుపట్టాలనే దానిపై దృష్టిపెడుతున్నారని అన్నారు. ఈవీఎంలను నిందించాలా..? లేక భాగస్వామ్య పక్షాలను తప్పుపట్టాలా అని ఆలోచిస్తున్నారని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!