PM Modi: నేను నిమిత్తమాత్రుడ్ని.. ప్రజలే ఈశ్వరస్వరూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచానికి పరిచయం చేయడానికి మన దగ్గర చాలా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో కాశీ క్షేత్రానికి పూర్వవైభవం తెచ్చినట్టే.. ఇతర పుణ్యక్షేత్రాల సంస్కరణ సంకల్పం ఉండొచ్చని ఆశించవచ్చా? అని అడిగిన ప్రశ్నకు సుదీర్ఘంగా వివరించారు. ‘‘విషయం ఏంటంటే.. నేను ఏమీ చేయలేదు. చేయడానికి నేను ఎవరిని?, దేవుడి దయ ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రజలు కూడా ఈశ్వరుడి స్వరూపాలే. ప్రజల కోరిక, ఆకాంక్ష బలంగా మారినప్పుడు వాళ్లకు ఒక కొత్త వెలుగు, కొత్త సామర్థ్యం కనిపిస్తుంది. నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే. బహుశా గంగామాత నన్ను ఇందుకే కాశీకి రప్పించి ఉంటుంది. నేను వెళ్లా. నాకు గుజరాత్ అనుభవం ఉంది. టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటూ ఇతర నమూనాల్ని చూడాల్సిన అవసరం లేదు.’’ అని మోడీ చెప్పారు.
‘‘ఉదాహరణకు జీ20 సదస్సు జరిగింది. 200కు పైగా సమావేశాలయ్యాయి. జీ 20తో సంబంధం ఉన్న కీలక బృందాలు భారత్కు వచ్చాయి. ఒక్కో దేశం నుంచి 300 మంది సభ్యులు వచ్చారు. వచ్చిన అతిథులంతా మన దేశంలోని వివిధ ప్రాంతాల్ని చూశారు. వైవిద్యాన్ని చూశారు. ఇక్కడి రంగు, రుచి, వాసనను ఆస్వాదించారు.
అప్పటిదాకా వారికి ఈ అనుభవం తెలియలేదు. 140 కోట్ల భారతీయులకు మార్కెట్ భాషలో చెప్పాలంటే..
ఇది మంచి అవకాశం.. కానీ మనం దానిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మేం అనేక సంస్కరణలు చేశాం. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేశాం.. రైళ్లు నడుస్తున్నాయి. ఉదాహరణకు రాములవారి సర్క్యూట్ ట్రైనే తీసుకోండి.
టికెట్ రేటు ఫిక్స్డ్ చేశాం. ఒక్కసారి ఆ రైలు ఎక్కాక.. అన్ని సౌకర్యాలు ఉంటాయి. వృద్ధులకు చాలా సదుపాయాలున్నాయి. వెళ్లాల్సిన చోటు చెబితే వాహన సౌకర్యం ఉంటుంది. దేశంలో టూరిజం వ్యవస్థ చాలా విశాలమైంది. మాకు చాలా ప్రణాళికలున్నాయి.’’ అని మోడీ తెలిపారు.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
‘‘మీ ఎన్టీవీ టీమ్ ఒక్కో సర్క్యూట్ను కెమెరా తీసుకెళ్లి పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి నేను ఈ విషయం చెబుతాను. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రతీ టూరిజం సర్క్యూట్లో వెల్లివిరుస్తున్న భక్తిభావం మీకు కనిపిస్తుంది. వారణాసి ఎంపీగా.. ఆ పుణ్యక్షేత్రం గురించి చెప్పాలంటే.. అక్కడికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ఒకసారి మహాత్మగాంధీ కాశీకి వచ్చారు.. అక్కడ అపరిశుభ్రత, సౌకర్యాల లేమిపై అసంతృప్తి చెందారు. గాంధీజీ కాలం నుంచి ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని నా మనసుకు అనిపించింది. గాంధీజీ చెప్పినదాన్ని పరిష్కరించాలని నేను అనుకున్నాను. కాశీ స్వరూపం మార్చాలనుకున్నాను. కాశీలో మౌళిక వసతులు పెంచాం. సదుపాయాలు పెంచాం. కాశీఘాట్లో అంతిమ సంస్కారాలు చేయడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఘాట్లో మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు త్వరగా చేసే వ్యవస్థ పెంచాం. ఇలా అనేక వసతులు కల్పించాం. దాని వలన కాశీకొచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.’’ అని మోడీ వెల్లడించారు.
‘‘విశ్వనాథ్ కారిడార్ ఏర్పాటుకు కాశీవాసులు సహకరించారు. లేదంటే కారిడార్ నిర్మించడం, యాత్రికుల కోసం ఇళ్లు సమీకరించడం కష్టమయ్యేది. ఇప్పటివరకు 15 కోట్ల మంది యాత్రికులు కాశీకి వచ్చారు. ఇంతమంది యాత్రికులు వచ్చినప్పుడు.. మీరే ఊహించండి. కాశీ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి చేరుకుంటుందో.. కాశీ ప్రజలకు ఉపాధి లభిస్తోంది. నావికులకు పని దొరుకుతోంది. పూలమ్మేవారికి, గెస్ట్హౌస్ల వారికి ఉపాధి దొరుకుతోంది.’’ అని మోడీ చెప్పుకొచ్చారు.
‘‘2023లో కేధర్నాథ్కు 20 లక్షల మంది యాత్రికులు వచ్చారు. ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థ కేధార్నాథ్ పర్యాటకం పైనే ఆధారపడింది. అదే రాష్ట్రానికి పెద్ద అండ, చార్ధామ్కు 55 లక్షల మంది యాత్రికులొస్తారు.
ఇదంతా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ఉజ్జయిన్ని ఆలయాన్ని 5 కోట్ల మంది దర్శించుకున్నారు. భక్తులు రాక అక్కడి ఆలయానికి ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది.’’ అని మోడీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!