Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Prime Minister Modi Key Comments On The Development Of Shrine

PM Modi: నేను నిమిత్తమాత్రుడ్ని.. ప్రజలే ఈశ్వరస్వరూపులు

Published Date :May 10, 2024 , 10:02 pm
By Suresh Maddala
PM Modi: నేను నిమిత్తమాత్రుడ్ని.. ప్రజలే ఈశ్వరస్వరూపులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచానికి పరిచయం చేయడానికి మన దగ్గర చాలా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో కాశీ క్షేత్రానికి పూర్వవైభవం తెచ్చినట్టే.. ఇతర పుణ్యక్షేత్రాల సంస్కరణ సంకల్పం ఉండొచ్చని ఆశించవచ్చా? అని అడిగిన ప్రశ్నకు సుదీర్ఘంగా వివరించారు. ‘‘విషయం ఏంటంటే.. నేను ఏమీ చేయలేదు. చేయడానికి నేను ఎవరిని?, దేవుడి దయ ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రజలు కూడా ఈశ్వరుడి స్వరూపాలే. ప్రజల కోరిక, ఆకాంక్ష బలంగా మారినప్పుడు వాళ్లకు ఒక కొత్త వెలుగు, కొత్త సామర్థ్యం కనిపిస్తుంది. నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే. బహుశా గంగామాత నన్ను ఇందుకే కాశీకి రప్పించి ఉంటుంది. నేను వెళ్లా. నాకు గుజరాత్ అనుభవం ఉంది. టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటూ ఇతర నమూనాల్ని చూడాల్సిన అవసరం లేదు.’’ అని మోడీ చెప్పారు.

‘‘ఉదాహరణకు జీ20 సదస్సు జరిగింది. 200కు పైగా సమావేశాలయ్యాయి. జీ 20తో సంబంధం ఉన్న కీలక బృందాలు భారత్‌కు వచ్చాయి. ఒక్కో దేశం నుంచి 300 మంది సభ్యులు వచ్చారు. వచ్చిన అతిథులంతా మన దేశంలోని వివిధ ప్రాంతాల్ని చూశారు. వైవిద్యాన్ని చూశారు. ఇక్కడి రంగు, రుచి, వాసనను ఆస్వాదించారు.
అప్పటిదాకా వారికి ఈ అనుభవం తెలియలేదు. 140 కోట్ల భారతీయులకు మార్కెట్ భాషలో చెప్పాలంటే..
ఇది మంచి అవకాశం.. కానీ మనం దానిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మేం అనేక సంస్కరణలు చేశాం. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేశాం.. రైళ్లు నడుస్తున్నాయి. ఉదాహరణకు రాములవారి సర్క్యూట్ ట్రైనే తీసుకోండి.
టికెట్ రేటు ఫిక్స్‌డ్ చేశాం. ఒక్కసారి ఆ రైలు ఎక్కాక.. అన్ని సౌకర్యాలు ఉంటాయి. వృద్ధులకు చాలా సదుపాయాలున్నాయి. వెళ్లాల్సిన చోటు చెబితే వాహన సౌకర్యం ఉంటుంది. దేశంలో టూరిజం వ్యవస్థ చాలా విశాలమైంది. మాకు చాలా ప్రణాళికలున్నాయి.’’ అని మోడీ తెలిపారు.

‘‘మీ ఎన్టీవీ టీమ్ ఒక్కో సర్క్యూట్‌ను కెమెరా తీసుకెళ్లి పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి నేను ఈ విషయం చెబుతాను. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రతీ టూరిజం సర్క్యూట్‌లో వెల్లివిరుస్తున్న భక్తిభావం మీకు కనిపిస్తుంది. వారణాసి ఎంపీగా.. ఆ పుణ్యక్షేత్రం గురించి చెప్పాలంటే.. అక్కడికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ఒకసారి మహాత్మగాంధీ కాశీకి వచ్చారు.. అక్కడ అపరిశుభ్రత, సౌకర్యాల లేమిపై అసంతృప్తి చెందారు. గాంధీజీ కాలం నుంచి ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని నా మనసుకు అనిపించింది. గాంధీజీ చెప్పినదాన్ని పరిష్కరించాలని నేను అనుకున్నాను. కాశీ స్వరూపం మార్చాలనుకున్నాను. కాశీలో మౌళిక వసతులు పెంచాం. సదుపాయాలు పెంచాం. కాశీఘాట్‌లో అంతిమ సంస్కారాలు చేయడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఘాట్‌లో మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు త్వరగా చేసే వ్యవస్థ పెంచాం. ఇలా అనేక వసతులు కల్పించాం. దాని వలన కాశీకొచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.’’ అని మోడీ వెల్లడించారు.

‘‘విశ్వనాథ్ కారిడార్ ఏర్పాటుకు కాశీవాసులు సహకరించారు. లేదంటే కారిడార్ నిర్మించడం, యాత్రికుల కోసం ఇళ్లు సమీకరించడం కష్టమయ్యేది. ఇప్పటివరకు 15 కోట్ల మంది యాత్రికులు కాశీకి వచ్చారు. ఇంతమంది యాత్రికులు వచ్చినప్పుడు.. మీరే ఊహించండి. కాశీ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి చేరుకుంటుందో.. కాశీ ప్రజలకు ఉపాధి లభిస్తోంది. నావికులకు పని దొరుకుతోంది. పూలమ్మేవారికి, గెస్ట్‌హౌస్‌ల వారికి ఉపాధి దొరుకుతోంది.’’ అని మోడీ చెప్పుకొచ్చారు.

‘‘2023లో కేధర్‌నాథ్‌కు 20 లక్షల మంది యాత్రికులు వచ్చారు. ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థ కేధార్‌నాథ్ పర్యాటకం పైనే ఆధారపడింది. అదే రాష్ట్రానికి పెద్ద అండ, చార్‌ధామ్‌కు 55 లక్షల మంది యాత్రికులొస్తారు.
ఇదంతా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ఉజ్జయిన్ని ఆలయాన్ని 5 కోట్ల మంది దర్శించుకున్నారు. భక్తులు రాక అక్కడి ఆలయానికి ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది.’’ అని మోడీ చెప్పుకొచ్చారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Development of shrine
  • G 20 summit 2024
  • key comments
  • Mahatma Gandhi
  • ntv

తాజావార్తలు

  • Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

  • PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions