PM Modi: పాక్తో యుద్ధం తర్వాత 93 వేల సైనికులు సరెండర్ అయ్యారు
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు. పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు. కానీ… వారికి ఆ ఆలోచనే రాలేదని చెప్పారు.
‘‘మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత్ సరిహద్దుకు అవతల కర్తార్పూర్ సాహిబ్ ఉంది. మనవైపు ఒక టవర్ కట్టారు. టవరెక్కి సిక్కులు దుర్బణిలో చూసి దర్శించుకునేవారు. నేను పంజాబ్లో పనిచేస్తున్నప్పుడు
ఇంత అవమానాన్ని ఎలా సహిస్తున్నారని అనుకునేవాడిని. నేను వచ్చాక పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నించాను. ఒక దారి దొరికింది ఇప్పుడు సిక్కులు వెళ్లి హాయిగా దర్శించుకుంటున్నారు. చారిత్రక ప్రదేశాలకు చాలా విశిష్టత ఉంటుంది.’’ అని తెలిపారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అంబేద్కర్ గురించి మాట్లాడుతూ..
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్కు సంబంధించి పంచతీర్థాల అభివృద్ధిపై నేను దృష్టి పెట్టాను. అంబేద్కర్ జన్మించిన ప్రాంతం.. ఆయన యూకేలో నివసించిన ప్రాంతం. అంబేద్కర్ దీక్ష స్వీకరించిన చోటు.. ఆయన పని చేసిన ప్రాంతం. ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన పుణ్యప్రదేశం. ఈ ఐదు ప్రాంతాలను నేను చాలా బాగా అభివృద్ధి చేశాను. ఒకచోట ఇంకా పని జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ జీవన చిత్రాన్ని అవగాహన చేసుకునేందుకు పంచ్ దీక్ష యాత్ర ఉపయోగపడుతుంది.’’ అని వివరించారు
‘‘స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టమైన దండి ఉద్యమాన్ని అంతా విస్మరించారు. నేను దండి ఉద్యమాన్ని మళ్లీ కళ్లకు కట్టేలా పునర్నిర్మించాను. ప్రపంచం భారతదేశాన్ని ఒకమహాశక్తిగా చూడాలన్నది నా కోరిక. అదే స్టాట్యూ ఆప్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే అది రెండింతల పెద్ద విగ్రహం. టూరిజాన్ని డెవలప్ చేయడం.. ముఖ్యమైన ప్రదేశాలను పునరుద్ధరించడం.. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. దేశ ప్రతిష్టను పెంచుతాయి. అందుకోసం మేం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
- Tags
- ntv
- NTV Telugu
- Pakistan
- PM Modi
- Reacts
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!