PM Modi: పాక్తో యుద్ధం తర్వాత 93 వేల సైనికులు సరెండర్ అయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు. పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు. కానీ… వారికి ఆ ఆలోచనే రాలేదని చెప్పారు.
‘‘మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత్ సరిహద్దుకు అవతల కర్తార్పూర్ సాహిబ్ ఉంది. మనవైపు ఒక టవర్ కట్టారు. టవరెక్కి సిక్కులు దుర్బణిలో చూసి దర్శించుకునేవారు. నేను పంజాబ్లో పనిచేస్తున్నప్పుడు
ఇంత అవమానాన్ని ఎలా సహిస్తున్నారని అనుకునేవాడిని. నేను వచ్చాక పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నించాను. ఒక దారి దొరికింది ఇప్పుడు సిక్కులు వెళ్లి హాయిగా దర్శించుకుంటున్నారు. చారిత్రక ప్రదేశాలకు చాలా విశిష్టత ఉంటుంది.’’ అని తెలిపారు.
Also Read
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
అంబేద్కర్ గురించి మాట్లాడుతూ..
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్కు సంబంధించి పంచతీర్థాల అభివృద్ధిపై నేను దృష్టి పెట్టాను. అంబేద్కర్ జన్మించిన ప్రాంతం.. ఆయన యూకేలో నివసించిన ప్రాంతం. అంబేద్కర్ దీక్ష స్వీకరించిన చోటు.. ఆయన పని చేసిన ప్రాంతం. ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన పుణ్యప్రదేశం. ఈ ఐదు ప్రాంతాలను నేను చాలా బాగా అభివృద్ధి చేశాను. ఒకచోట ఇంకా పని జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ జీవన చిత్రాన్ని అవగాహన చేసుకునేందుకు పంచ్ దీక్ష యాత్ర ఉపయోగపడుతుంది.’’ అని వివరించారు
‘‘స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టమైన దండి ఉద్యమాన్ని అంతా విస్మరించారు. నేను దండి ఉద్యమాన్ని మళ్లీ కళ్లకు కట్టేలా పునర్నిర్మించాను. ప్రపంచం భారతదేశాన్ని ఒకమహాశక్తిగా చూడాలన్నది నా కోరిక. అదే స్టాట్యూ ఆప్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే అది రెండింతల పెద్ద విగ్రహం. టూరిజాన్ని డెవలప్ చేయడం.. ముఖ్యమైన ప్రదేశాలను పునరుద్ధరించడం.. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. దేశ ప్రతిష్టను పెంచుతాయి. అందుకోసం మేం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
- Tags
- ntv
- NTV Telugu
- Pakistan
- PM Modi
- Reacts
తాజావార్తలు
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!