PM Modi: తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను క్లీన్స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 80-90లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో అదే విధంగా తెలంగాణలో కూడా జరుగుతోందని ప్రధాని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు. ఇక్కడ ప్రజలు తక్కువ సయమంలోనే ప్రజలు నిరాశలో పడిపోయారని అన్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భారీ బహుమతి ఇచ్చిందని, కానీ వాళ్లు మాత్రం మేం రాజులం, ఏమీ చేయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్పై కోపం కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయిందని అన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వింటున్నానని, ఈ సంగతి విని నేను ఆశ్చర్యాపోయానని, తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను కానీ ఎవరి పేరూ చెప్పలేదని, వాళ్లెందుకు అలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
Read Also: Narendra Modi : నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. మాది దేశం మొత్తం ఒకటే విజన్ అని, 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రం కలిపి ఒకే దిశలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రయాణించాలని అన్నారు. తెలంగాణలో పుష్కలంగా వనరులు ఉన్నాయని అన్నారు. గతంలో ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై నగరాల పేర్లు మాత్రమే వినిపించేవని, ప్రస్తుతం బెంగళూర్, హైదరాబాద్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణలో వీలైనంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో రైతుల జీవితాలు మెరుగపడాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలను పారిశ్రామికంగా వృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ పాలకడు ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. తెలంగాణలో ఐదారు పట్టణాలను ఆధునికంగా తీర్చిదిద్దవచ్చని, హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చవచ్చని చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో చేయడానికి చాలా స్కోప్ ఉందని చెప్పారు. నేషనల్ హైవేలను ఆరు లైన్లుగా మారుస్తున్నామని, హైదారాబాద్కి వందేభారత్ రైలు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశాన్ని ఫార్మాసీ హబ్గా మార్చడానికి హైదరాబాద్కి చాలా అవసరమని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!