ఆ పొలిటికల్ బ్రదర్స్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆశించి సీట్లు రాలేదు. అలాగని ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. తాము ఏదో అనుకుంటే… అక్కడ ఇంకేదేదో జరిగిపోయింది. సీట్లు ఆశించిన పార్టీలు ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగా బరిలో దిగాలా లేక నచ్చిన అభ్యర్థికి మద్దతివ్వాలా అన్న డైలమాలో ఉన్నారు ఇంతకీ ఎవరా బ్రదర్స్? ఏంటా స్టోరీ? బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అన్న ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు. ఈ బ్రదర్స్…
తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా? లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారా? కీలకమైన ఎన్నికల టైంలో దాని ప్రభావం పార్టీ మీద ఎంతవరకు పడబోతోంది? గ్యాప్ తగ్గించడానికి అధిష్టానం దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? చక్కదిద్దే బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతోంది ఎవరు? లోక్సభ ఎన్నికల్లో ఈసారి టార్గెట్ 400 అంటున్న బీజేపీ ఆక్రమంలో కొన్ని కీలకమైన రాష్ట్రాలపై ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది. ఆ లిస్ట్లో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట…
ఆ నియోజకవర్గంలో ఇంటిపోరు టీడీపీని ఇరుకున పెడుతోందా? పార్టీ అభ్యర్థికి కమ్మ సామాజికవర్గానికి మధ్య గ్యాప్ పెరిగిందా? అదే టోటల్గా తేడా కొడుతోందా? ఈ వర్గపోరు ప్రభావం గెలుపు అవకాశఆల మీద ఎంత వరకు పడుతుంది? రచ్చకెక్కు తున్న అంతర్గత పోరుకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? జగ్గయ్యపేట టీడీపీలో వార్ ముదురుతోందట. ఇప్పటి వరకు నేతల మధ్య ఉన్న కలహాలు ఇప్పుడు రచ్చెకెక్కి విమర్శలు చేసుకునే వరకు దాకా వెళ్ళడం పార్టీ అధిష్టానాన్ని కూడా…
పార్లమెంట్ ఎన్నికలను బిజెపి తెలంగాణలో లాంచింగ్ ప్యాడ్లా ఉపయోగించుకోవాలని అనుకుంటోందా? కేవలం ఎంపీ సీట్లతో సరిపెట్టకుండా… ఆ బేస్తో రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయా? కాషాయదళం ఏక కాలంలో అమలు చేయాలనుకుంటున్న ఆ ప్లాన్స్ ఏంటి? ఎన్ని ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలన్న టార్గెట్తో టీ బీజేపీ రంగంలోకి దిగింది? తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. ఆ పరంగా క్లారిటీ వచ్చేసింది గనుక ఇక ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించింది. అన్నిటికీ…
శ్రీకాకుళం ఎంపీ సీట్లో ఈసారి రామ్మోహన్ నాయుడికి మామూలుగా ఉండదా? గత రెండు విడతల్లో ఎదురవని, అసలు ఊహించని సమస్యలు ఎదురవబోతున్నాయా? సొంత పార్టీ నేతలే ఆయన్ని ఓడిస్తామని శపధం చేయడానికి కారణాలేంటి? మారుతున్న సిక్కోలు రాజకీయం ఏంటి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది శ్రీకాకుళం జిల్లా. కానీ… గత ఎన్నికలలో వైసీపీ హవా నడిచింది. అందుకే ఈసారి పట్టు నిలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది పార్టీ నాయకత్వం. ఆ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ముందున్నారన్నది…
సైకిల్ సర్ సర్మని దూసుకువెళ్లే అసెంబ్లీ నియోజకవర్గం అది. టీడీపీ తరపున జస్ట్… నామినేషన్ వేస్తే చాలు గెలుపు ఖాయమని అనుకునే సీటు అది. అలాంటి చోట ఇప్పుడెందుకో కేడర్కి డౌట్ కొడుతోందట. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వెంట నియోజకవర్గ ముఖ్య నాయకులు కనిపించడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే… స్టోరీ చాలానే ఉందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా స్టోరీ? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం…..ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే సీటు ఇది.…
అడవిలో అలజడి మొదలవుతోందా? పొలిటికల్ పార్టీలకు చుక్కలు కనిపించబోతున్నాయా? ఆదివాసీ వర్సెస్ లంబాడా పోరులో రాజకీయ పార్టీలు నలిగిపోతున్నాయా? టిక్కెట్ ఇవ్వకుంటే మా తడాఖా ఏంటో చూపిస్తామంటూ… ఒక వర్గం తొడగొడుతోందా? ఇంతకీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో లంబాడాల బాధేంటీ.. ఆదివాసీల డిమాండ్ ఏంటి? పొలిటికల్ వార్ ఎలా మారబోతోంది? ఆదిలాబాద్ లోక్ సభ స్థానం ఎస్టీ రిజర్వ్డ్ కాగా ఇక్కడ మెజార్టీ పార్టీలు ఆదివాసీలకే టిక్కెట్ ఇచ్చాయి. దీంతో లంబాడా వర్గం కన్నెర్రజేస్తోంది. ఓటర్లుగా మేమే…
అమ్మో ఆఫీస్ అంటున్నారు అక్కడ గెలిచిన ప్రజా ప్రతినిధులు. ముందు గెలిచినాయన అసలు అందులోకి అడుగే పెట్టకపోతే… ప్లేస్ మారితే ఫేట్ మారుతుందనుకుంటూ… ఏకంగా ఆఫీస్నే మార్చేస్తున్నారు తర్వాత గెలిచిన మంత్రివర్యులు. వాస్తు రాజకీయ నాయకులకేనా? మాకు ఉండదా అన్నది ఆఫీసర్స్ క్వశ్చన్. ఇంతకీ ఏంటా వాస్తు వ్యవహారం? ఆ ఆఫీస్ అంటే ఎందుకంత భయం? నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిన ఐదేళ్ళ తర్వాత వినియోగంలోకి రాబోతోంది. అయితే… క్యాంప్ ఆఫీస్గా మాత్రం కాదు. జస్ట్…
అత్త తిట్టినందుకు కాదు…. తోటి కోడలు నవ్వినందుకు నా బాధ అన్నట్టుగా ఉందట ఆ ఎమ్మెల్యే వ్యవహారం. సిట్టింగ్నైనా పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు బాధ లేదుగానీ… కొత్త అభ్యర్థి పూచిక పుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అంటున్నారాయన. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయంతో నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏం చేశారాయన? చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా…. ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జంప్…
టీడీపీకి ఇప్పుడు అతి పెద్ద సమస్య ఎదురు కానుంది. జిల్లాల్లో చాలా కాలంగా పాతుకుని పోయిన వాళ్లకు.. అతి పెద్ద కుటుంబాలకు నో టిక్కెట్ అని చెప్పేసింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడిది టీడీపీ గెలుపుపై అత్యంత ప్రభావితం చూపే అంశంగా కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అసంతృప్తులను బుజ్జగించేస్తామనే ధీమాతో టీడీపీ హైకమాండ్ కన్పిస్తోన్నా.. అంసతృప్తులు ఎంత వరకు లైన్లోకి వస్తారోననేది డౌటుగానే కన్పిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించే అంశంపై మరోసారి సీరియస్గా ఫోకస్…