వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ టీమ్ కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగనున్న కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి రానున్నట్లు సమాచారం.
Ind vs Eng: ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తన ఆరో మ్యాచ్ని ఇంగ్లండ్తో ఆడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. చివర్లో జిమ్మీ నీషమ్ (58) దూకుడుగా ఆడినప్పటికీ చివరి ఓవరల్ రనౌట్ రూపంలో వెనుతిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 383/9 పరుగులు చేసింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే చివరకు ఆడి 95 పరుగులు చేసి ఔటవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంకో…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.
వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఏడ్చేశారని సంజయ్ బంగర్ చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 273 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు.
న్యూజిలాండ్ ఆటగాళ్లకు పాకిస్తాన్ షెహర్ షిన్వారీ ఆఫర్ ఇచ్చింది. ఈసారి న్యూజిలాండ్ బౌలర్ జిమ్మీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘‘హే జిమ్మీ నీష్ (జేమ్స్ నీషామ్) నీవు భారత జట్టును ఓడిస్తే గనుక, మేము పాకిస్థానీలం నిన్ను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం’’అంటూ ఓ కామెడీ ట్వీట్ చేసింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో జేమ్స్ నీషామ్ ఆడటం లేదు. అయినా షెహర్ కు ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాదు. అందుకే ఈ నటిని నెటిజన్లు తెగ ట్రోల్…
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. ఈరోజు జరిగే గ్రూప్ దశ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైనా తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశారు.
2023 వన్డే ప్రపంచ కప్లో రేపు (ఆదివారం) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్లు ఇప్పటి వరకు ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. అయితే ఈ కీలకమైన మ్యాచ్కు ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్.