New Zealand: న్యూజిలాండ్కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Pacer Matt Henry ruled out of ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లిన న్యూజీలాండ్కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టుకు దూరం అయ్యాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి వైదొలిగాడు. మ్యాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో కైల్ జెమిసన్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని కివీస్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు.
శనివారం బెంగళూరులో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో కైల్ జెమిసన్ నేరుగా బరిలోకి దిగనున్నాడు. మెగా టోర్నమెంట్లో ట్రావెలింగ్ రిజర్వ్గా జేమీసన్ ఉన్న విషయం తెలిసిందే. జేమీసన్ ప్రపంచకప్లో ఆడడం ఇదే మొదటిసారి. మెగా టోర్నీలో న్యూజీలాండ్ను గాయాలు వేధిస్తున్నాయి. కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, లాకీ ఫెర్గూసన్ మరియు జేమ్స్ నీషమ్ గాయపడ్డారు. దాంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆటలో కేవలం 11 మంది ఫిట్ ప్లేయర్లను మాత్రమే కలిగి ఉంది. దక్షిణాఫ్రికా మ్యాచులోనే మ్యాట్ హెన్రీకి గాయం అయింది. హెన్రీ ఏడు మ్యాచ్ల్లో 5.79 ఎకానమీ, సగటు 28.63తో 11 వికెట్లు తీశాడు.
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
Also Read: Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై అభిమానం.. 88 శాతం తగ్గింపుతో రూ. 7కే బిర్యాని! ఎక్కడో తెలుసా?
టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లను ఓడించిన న్యూజీలాండ్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై ఓడిపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓడిపోవడంతో కివీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో న్యూజీలాండ్ తప్పక గెలవాల్సి ఉంది. తదుపరి మ్యాచ్ల్లో పాకిస్థాన్ (నవంబర్ 4న), శ్రీలంక (నవంబర్ 9)తో కివీస్ తలపడాల్సి ఉంది. పాకిస్థాన్, శ్రీలంక జట్లపై గెలిస్తే 12 పాయింట్లతో కివీస్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్లో ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆ టీమ్ ఆధారపడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!