Ratan Tata: ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు.
Fake Notes : మహారాష్ట్రలోని థానేకు చెందిన పోలీసులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్ నుండి నకిలీ డబ్బు ప్రింట్ చేయడం నేర్చుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భవేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
లగ్జరీ హౌసింగ్ భారతదేశంలో చెప్పుకోదగిన పెరుగుదలను చూస్తోంది. ఇది వివిధ రంగాలలో సంపద పట్ల దేశం యొక్క పెరుగుతున్న అభిరుచిని ప్రతిబింబిస్తుంది. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో టాప్ 7 నగరాల్లో విక్రయించిన 1,30,170 యూనిట్లలో, 1.5 కోట్ల రూపాయలకు పైగా ధర కలిగిన లగ్జరీ గృహాలు 21% వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం 27,070 యూనిట్లు. ఇది 2019 మొదటి త్రైమాసికం నుండి మూడు రెట్లు పెరిగింది, ఇక్కడ లగ్జరీ గృహాలు…
దుమ్ము తుఫాన్ ముంబైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది. భారీ ఈదురుగాలులు వీయడంతో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా.. భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో.. ముంబై వాసులు వేడి నుండి ఉపశమనం పొందారు. కాగా.. ఈ సీజన్లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెట్రోపాలిటన్ యొక్క స్కైలైన్ మురికి గాలులతో చుట్టుముట్టింది. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది.
మద్యం మత్తులో ఉన్న మహిళలను ప్రశ్నించగా వారు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పాటు దుర్భాషలాడారు. అలాగే, ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ చేతిని కొరికి, ఆమె యూనిఫాం చింపేశారు.