Swati Maliwal: స్వాతి మాలివాల్ కేసులో బిభవ్ కుమార్ ముంబైకి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు ముంబైకు తీసుకెళ్లారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ను ముంబైకి తరలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముంబై తీసుకెళ్లింది. బిభవ్.. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తన ఐఫోన్ను ఫార్మాట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫార్మాట్ చేసిన ఐఫోన్ లోని డేటాను సేకరించడానికి పోలీసులు ముంబైకి తీసుకెళ్లారు.

Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
బిభవ్ కుమార్ కస్టడీ వచ్చే గురువారంతో ముగియనుంది. తమ విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఆయన రిమాండ్ను పొడిగించమని కానీ, సెక్షన్ 201 విధించేందుకు అనుమతించమని కానీ కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉంది. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసే వ్యక్తులను శిక్షించేందుకు సెక్షన్ 201 నమోదు చేస్తారు.
మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్పై బిభవ్ కుమార్ దాడికి తెగబడ్డాడు. ఆమెను ఇష్టానురీతిగా హింసించి.. దాడికి పాల్పడ్డాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉండడంతో లోతుగా విచారిస్తున్నారు.
కేజ్రీవాల్ నివాసంలో కూర్చుని ఉండగా బిభవ్కుమార్ వచ్చి దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 7-8 సార్లు చెంపపై కొట్టాడని.. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడని తెలిపింది. పరిగెడుతుంటే చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడని ఆరోపించింది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయానని.. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం పోలీసులు మాలివాల్ను కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
ఇదిలా ఉంటే స్వాతి మలివాల్పై దాడి అంశంపై దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్ని ఏర్పాటు చేసింది. దీనికి నార్త్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటరీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహించనున్నారు. సిట్లో ముగ్గురు ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు. వీరిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లోని ఒక అధికారి కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!