Ratan Tata: “బాధ్యతతో ఓటేయండి”.. ముంబై వాసులకు రతన్ టాటా పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratan Tata: ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు. ఐదో దశలో ముంబైతో పాటు దేశంలోని 49 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ‘‘సోమవారం ముంబైలో ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను’’ అని రతన్ టాటా ఎక్స్లో పోస్ట్ చేశారు.
ముంబైలోని పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ కూడా ముంబై వాసులను సోమవారం బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. తాను ఏడాదిలో ఏ రోజు కూడా వ్యాయామాన్ని మిస్ కానని, అలాగే మే 20 ఓటు వేసే అవకాశాన్ని కూడా కోల్పోనని అన్నారు. ‘‘కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి, కానీ వెళ్లి ఓటు వేయండి, మీ భారత్ మాతాను ఇబ్బందుల్లోకి నెట్టొద్దు .. భారత్ మాతా కీ జై అని’’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Husband Killed Wife: దారుణం.. భార్యను అతికిరాతకంగా రోకలిబండతో కొట్టి చంపిన భర్త
ముంబైలోని 6 స్థానాలైన ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై సౌత్ మరియు ముంబై సౌత్ సెంట్రల్లకు ఐదో విడతలో మే 20న ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్రలోని ఇతర నియోజకవర్గాలైన ధూలే, దిండోరి, నాసిక్, కళ్యాణ్, పాల్ఘర్, భివాండి, థానేలకు కూడా ఇదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత దేశంలో ఎక్కువగా ఈ రాష్ట్రం నుంచి ఎంపీ స్థానాలు ఉండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఈ రోజు సాయంత్రంలో ఐదో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 2024 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. కౌంటింగ్ మరియు ఫలితాలు జూన్ 4 న ప్రకటించబడతాయి.
https://twitter.com/RNTata2000/status/1791721493962858791
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!