మమతా కులకర్ణి.. ఒకనాడు బాలీవుడ్ను షేక్ చేసిన హీరోయిన్. భారతీయ చలనచిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విశాఖపట్నం రానున్నారు.. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖ రానున్నారు..
మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్ దాఖలు చుఏసింది.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, పోలీసులు, న్యాయవాది. .. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అఫిడవిట్లో సీఐడీ పేర్కొంది..
ఎయిరిండియా పైలట్ సృష్టి తులి మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు ఆదిత్య పండిట్ దారుణాతీదారుణంగా టార్చర్ పెట్టిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు.
ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.