Mumbai: ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్బోటు.. ఇద్దరు మృతి.. పలువురు గల్లంతు
- ముంబై తీరంలో ఘోర ప్రమాదం
- ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్బోటు
- ఇద్దరు మృతి.. పలువురు గల్లంతు
ముంబై తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ స్పీడుబోటు అమాంతంగా వచ్చి ఢీకొట్టడంతో ఫెర్రీ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆనందం కాస్త విషాదంగా మారడంతో టూరిస్టులు షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నేవీ గార్డ్సు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం బోటులో 80 మంది పర్యాటకులు పర్యటిస్తున్నారు. పలువురిని ప్రయాణికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ఫెర్రీ బోటు ప్రయాణికులతో వెళ్తోంది. అయితే అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ స్పీడ్బోటు ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునగడం ప్రారంభించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయారు. మరికొందరు షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పోర్టు అధికారులు, కోస్ట్గార్డ్, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు సిబ్బందితో పాటు 85 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పీడ్బోటు వేగంగా ఢీకొట్టిన దృశ్యాలు.. మొబైల్లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్అవుతున్నాయి.
Also Read
ఇదిలా ఉంటే ఫెర్రీ బోల్తా పడే సమయంలో లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారు. అయితే కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయినట్లుగా కనిపిస్తోంది. స్పీడ్బోటు ఢీకొట్టగానే సెకన్లలోనే ఫెర్రీ మునిగిపోయింది. ఒక వైపు ఒరిగిపోయింది. ఈ గందరగోళంలో కొందరు మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావల్సి ఉంది.
Shocking Video: लाइव वीडियो: मुंबई में इंडिया गेट के पास की घटना
एक स्पीडबोट ने तेज गति से दूसरी नाव को टक्कर मार दी
नाव पर 60 यात्री सवार थे।#MUMBAI #BOAT pic.twitter.com/juabBdwgWa
— Jaimin Vanol (@VanolJaimin99) December 18, 2024
A boat ferrying passengers near Elephanta has capsized. Mumbai Police and the Indian Navy are conducting rescue operations. Further details are awaited. pic.twitter.com/TzHPpL7Fnp
— Richa Pinto (@richapintoi) December 18, 2024
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!