khaki Ganpati In Mumbai: వినాయక చవితి వేడుకల్లో వివిధ రుపాల్లో గణనాథుడు కొలువవుతున్నాడు. భక్తులు తమకు నచ్చిన స్టైల్లో వినాయకులను ప్రతిష్టించారు. ఇటీవల పుష్ఫ రాజ్ తరహాలో తగ్గేదే లేదనే స్టైల్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం చూశాం. తాజాగా ముంబై పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఓ వైపు భక్తితో పాటు ప్రజలకు సందేశాన్ని ఇచ్చే విధంగా ‘‘ ఖాకీ గణపతి’’ని ప్రతిష్టించారు.
మహారాష్ట్ర ముంబైలోని బోరివాలిలో ఇవాళ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. బోరివాలి వెస్ట్లోని సాయిబాబా నగర్లో భవనం కుప్పకూలగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని తనిఖీ చేపట్టారు.
మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మంజార్సంబా-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు.
TTD Temple in Mumbai: దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిధులు, భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు భూమి పూజకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న భారీ ఎత్తున ముంబైలో టీటీడీ ఆలయానికి భూమి పూజ చేపట్టాలని అధికారులు తలపెట్టారు. ఈ మేరకు పలు పార్టీలకు…
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని కోఠార్ణే గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలో ముంబైలోని శివాజీ నగర్ బైగన్వాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం నలుగురు శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకాలో గల కడ్బన్వాడి గ్రామంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఒక ట్రైనీ విమానం వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న 22 ఏళ్ల భావికా రాఠోడ్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది.
ప్రతీ ఏడాది ఉల్లి ధరలు సామాన్యుడికి కంట తడి పెట్టిస్తుంటాయి. కొన్ని సార్లు కిలో ఉల్లి ధర ఏకంగా రూ.100ను దాటి పోతుంది. దీంతో సామాన్యుడిపై విపరీత భారం పడుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఉల్లి ధరల గురించి ప్రజలు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. దీంతో ఇప్పటి వరకు…