Mumbai: బురఖా ధరించడం లేదని భార్యను హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband killed his wife for not wearing a burqa: ఓ వైపు హిజాబ్ వద్దు అంటూ కరడుగట్టిని ఇస్లామిక్ దేశం ఇరాన్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే యువతి హిజాబ్ ధరించనుందుకు పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తరువాత అమ్మాయి చనిపోవడంతో అక్కడి యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మనదేశంలో మాత్రం కొంతమంది ఇష్టం లేకున్నా హిజాబ్, బురఖా వంటి వాటిని మహిళలపై రుద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Mallareddy Narayana Hospital: మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ఈవెంట్
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
తాజాగా ముంబైలో ఓ టాక్సీ డ్రైవర్ బురఖా ధరించలేదని విడిపోయిన భార్యను చంపాడు. తన భార్య బురఖా వేసుకోవడం లేదని.. అందుకే చంపానని పోలీసుల విచారణలో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన ఇక్బాల్ షేక్ కు హిందూ యువతి రూపాలితో మూడేళ్ల క్రితం 2019లో వివాహం అయింది. వివాహం తరువత రూపాలి తన పేరును జరినాగా మార్చుకుంది. 2020లో వీరిద్దరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భర్త ఇక్బాల్ తో సహా అతని కుటుంబ సభ్యులు రూపాలిని బురఖా ధరించాలని బలవంతం చేస్తున్నారు.
దీంతో రూపాలి గత కొన్ని నెలలుగా ఇక్బాల్ షేక్ తో విడిపోయి తన కుమారుడితో విడిగా ఉంటోంది. అయితే సెప్టెంబర్ 26న విడాకులపై మాట్లాడాలని రూపాలని పిలిచాడు ఇక్బాల్. రాత్రి 10 గంటలకు ఇద్దరు కలుసుకుని విడాకులతో మాట్లాడుతున్న సమయంలో కొడుకు ఎవరి వద్ద ఉండాలనే దానిపై ఇద్దరి మధ్య వాగ్వాదం నిడిచింది. దీంతో పాటు గతంలోని విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఇక్బాల్, రూపాలిని సందులోకి తీసుకెళ్లి కత్తితో చాలా సార్లు పొడిచాడు. తీవ్రగాయాలైన ఆమె అక్కడిక్కడే మరణించిందని పోలీసులు వెల్లడించారు. ముంబై తిలక్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 302 హత్యానేరం కేసులు పెట్టి విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!