Mumbai: బురఖా ధరించడం లేదని భార్యను హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband killed his wife for not wearing a burqa: ఓ వైపు హిజాబ్ వద్దు అంటూ కరడుగట్టిని ఇస్లామిక్ దేశం ఇరాన్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే యువతి హిజాబ్ ధరించనుందుకు పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తరువాత అమ్మాయి చనిపోవడంతో అక్కడి యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మనదేశంలో మాత్రం కొంతమంది ఇష్టం లేకున్నా హిజాబ్, బురఖా వంటి వాటిని మహిళలపై రుద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Mallareddy Narayana Hospital: మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ఈవెంట్
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
తాజాగా ముంబైలో ఓ టాక్సీ డ్రైవర్ బురఖా ధరించలేదని విడిపోయిన భార్యను చంపాడు. తన భార్య బురఖా వేసుకోవడం లేదని.. అందుకే చంపానని పోలీసుల విచారణలో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన ఇక్బాల్ షేక్ కు హిందూ యువతి రూపాలితో మూడేళ్ల క్రితం 2019లో వివాహం అయింది. వివాహం తరువత రూపాలి తన పేరును జరినాగా మార్చుకుంది. 2020లో వీరిద్దరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భర్త ఇక్బాల్ తో సహా అతని కుటుంబ సభ్యులు రూపాలిని బురఖా ధరించాలని బలవంతం చేస్తున్నారు.
దీంతో రూపాలి గత కొన్ని నెలలుగా ఇక్బాల్ షేక్ తో విడిపోయి తన కుమారుడితో విడిగా ఉంటోంది. అయితే సెప్టెంబర్ 26న విడాకులపై మాట్లాడాలని రూపాలని పిలిచాడు ఇక్బాల్. రాత్రి 10 గంటలకు ఇద్దరు కలుసుకుని విడాకులతో మాట్లాడుతున్న సమయంలో కొడుకు ఎవరి వద్ద ఉండాలనే దానిపై ఇద్దరి మధ్య వాగ్వాదం నిడిచింది. దీంతో పాటు గతంలోని విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఇక్బాల్, రూపాలిని సందులోకి తీసుకెళ్లి కత్తితో చాలా సార్లు పొడిచాడు. తీవ్రగాయాలైన ఆమె అక్కడిక్కడే మరణించిందని పోలీసులు వెల్లడించారు. ముంబై తిలక్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 302 హత్యానేరం కేసులు పెట్టి విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!