Karnataka: గంజాయి స్మగ్లర్ల దాడి.. చావుబతుకుల మధ్య పోలీస్ ఇన్స్పెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja smugglers attacked the police: గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడ్డారు స్మగ్లర్లు. దాడిలో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చావుబతులకు మధ్య ఉన్నారు. సీఐ శ్రీమంత్ ఇల్లాల్ నేతృత్వంలో పోలీసుల టీం దర్యాప్తులో భాగంగా బీదర్ జిల్లాలో సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామంలో గంజాయి పంటను సాగు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. బీదర్ జిల్లాలోని కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని తురోరి, హోన్నాలి గ్రామాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి 40 మందికి పైగా స్మగ్లర్ల ముఠా పోలీసులపై విచక్షణారహితంగా దాడులు చేశారు.
దాడిలో సీఐ శ్రీమంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కలబురిగిలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీమంత్ పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో ఉపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తల, ముఖంపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఐజీ మనీష్ ఖర్చికర్, ఎస్పీ ఇషా పంత్, ఏఎస్పీ ప్రసన్న దేశాయ్, ఇతర సీనియర్ ఆఫీసర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: North Korea: నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం.. కమలా హారిస్ పర్యటన ముందు కీలక చర్య
సీఐ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయన్ను హైదరాబాద్ లేదా బెంగళూర్ కు తరలించాలని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర సూచించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయనను ఇతర ప్రాంతాలకు తరలించడం అంత సురక్షితం కాదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉస్మానాబాద్ ఎస్పీతో చర్చించామని ఎస్పీ ఇషా పంత్ వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆమె వెల్లడించారు.
గురువారం కలబురిగి పోలీసులు ఇద్దరు గంజాయి వ్యాపారులను పట్టుకుని విచారించగా.. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఉస్మానాబాద్ జిల్లా ఒమెర్గా తాలుకాలోని వ్యవసాయక్షేత్రంలో గంజాయిని సాగు చేస్తున్నారని నిందితులిద్దరు వెల్లడించారు. ఈ సమాచారంతో పోలీసులు రైడ్ చేయడానికి వెళ్లిన క్రమంలో పోలీసులపై దాడి జరిగింది. అయితే ముందుగా కర్ణాటక పోలీసులు, మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చే లోపే కర్ణాటక పోలీసులపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!