Eknath Shinde: నేను “కట్టప్ప”నే కావచ్చు.. కానీ మీలాగ మాత్రం కాదు.. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM eknath shinde comments on uddhav thackeray: దసరా వేడుకలు మహారాష్ట్ర రాజకీయాల్లో కాకపుట్టించాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం చెలరేగింది. శివసేన ఇరు వర్గాల మధ్య విమర్శలు చెలరేగాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. బాల్ థాకరే స్థాపించిన పార్టీ ఎవరి ప్రైవేట్ కంపెనీ కాదని.. అది అందరికి చెందుతుందని అన్నారు. బుధవారం ముంబై జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. శివసేన ఉద్ధవ్ ఠాక్రేది కానది.. శివసేన కోసం చెమటలు అర్పించిన శివసైనికులదని.. మీలాంది వారి కోసం కాదని ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశారు.
Read Also: West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
అంతకు ముందు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేను ద్రోహి అని విమర్శించారు. దీనికి బదులు ఇస్తూ.. 2019లో నిజమైన ద్రోహం జరిగిందని.. బ్యానర్లపై మోదీ, బాల్ థాకరే బొమ్మతో ఎన్నికలకు వెళ్లామని.. ఈ కూటమికే ప్రజలు పట్టం కట్టారని షిండే అన్నారు. కానీ మీరు కూటమిని వదిలి ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపారని విమర్శించారు. ఉద్ధవ్ ఠాక్రే నన్ను కట్టప్పగా విమర్శిస్తున్నారని.. అయితే నేనుు కట్టప్పనే కావచ్చు.. కానీ ఆత్మగౌరవం ఉందని.. మీలాగా ద్వంద్వ ప్రమాణాలు లేవని ఏక్ నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ఓటేస్తే మీరు కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని ప్రజలను మోసం చేశారని.. ముంబైలోని బాల్ థాకరే స్మారంక వద్ద మోహకరిల్లాలని ఉద్దవ్ ఠాక్రేను డిమాండ్ చేశారు షిండే.
అంతకుముందు దసరా వేడులకల్లో పాల్గొన్న ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. సీఎం ఏక్ నాథ్ షిండేను కట్టప్పగా పోల్చారు. దేశద్రోహి అని.. వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. నేను ఆస్పత్రిలో చేరినప్పుడు రాష్ట్రబాధ్యతలు ఇచ్చిన వ్యక్తులు కట్టప్పగా మారి మాకు ద్రోహం చేశారని ఆయన అన్నారు. బీజేపీ, శివసేనకు ద్రోహం చేసిందని.. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చామని ఆయన అన్నారు. తన తండ్రి పార్టీని ఏక్ నాథ్ షిండే దోచుకున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే దసరా వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే అన్నా జైదేవ్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేతో వేదిక పంచుకున్నారు.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!