India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England: టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్లోకి దిగనుంది. ఇక సూపర్ 8లో సంజు శామ్సన్ 97 పరుగులు చేసి వెస్టిండీస్పై విజయం సాధించడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ అద్వితీయంగా సెమీస్లో అడుగుపెట్టింది. మరోవైపు, హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలతో సంచలనం సృష్టించింది. ఇక ఈ మ్యాచ్లో గెలిచే జట్టు ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది.
READ MORE: మండే వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే సూపర్ హైడ్రేటింగ్ ఫుడ్స్
Also Read
టాస్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత జట్టు తరఫున నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా బ్యాటింగ్ చేయాలనే ఆలోచన తమకు ఉందని చెప్పాడు. ఇది సెమీ ఫైనల్ వంటి కీలక పోటీ కావడంతో ముందుగా అత్యధికంగా పరుగులు సాధించి ఒత్తిడి సృష్టించాలని భావించినట్టు తెలిపాడు. మైదానంలో గాలి సైతం కొంచెం ఎక్కువగా ఉందని, ఈ రోజు మంచు ప్రభావం పెద్దగా ఉండదని అనిపిస్తోందన్నాడు. పిచ్ చాలా బాగుందని, ఇక్కడ ఉన్న పిచ్లలో ఇదే ఉత్తమంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. భారత్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. ఇక ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బ్రూక్ మాట్లాడుతూ.. “పిచ్ చాలా బెటర్గా ఉంది. అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నా. ఈ మైదానంలో భారత జట్టుకు మా కంటే ఎక్కువ అనుభవం ఉంది. అయినప్పటికీ మేము వెనక్కి తగ్గాము. అలాగే మైదానంలో భారత అభిమానుల గోల ఎక్కువగా ఉండబోతోందని, ఆ శబ్దాన్ని తగ్గించేలా మంచి ఆట ఆడాలని ఆశిస్తున్నాం.” అన్నాడు. ఇక ఇంగ్లాండ్ జట్టులో ఒక మార్పు చేశారు. రెహాన్ అహ్మద్ను తప్పించి జామీ ఓవర్టన్ను జట్టులోకి తెచ్చారు. దీంతో సెమీ ఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
గ్రౌండ్ విషయానికి వస్తే.. గ్రూప్ దశ మ్యాచ్ల సమయంలో కంటే ఇప్పుడు మైదానంలో కొంచెం ఎక్కువ వేడి కనిపిస్తోంది. వాతావరణ అంచనాల ప్రకారం గరిష్ఠ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల వరకు చేరింది. మ్యాచ్ సాగుతున్నకొద్దీ అది ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే మైదానం మీదుగా సుమారు పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఆ గాలి ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ స్టాండ్, దిలీప్ వెంగ్సర్కార్ స్టాండ్ వైపు నుంచి మైదానాన్ని తాకుతోంది. ఈ మ్యాచ్ కోసం మైదానంలోని ఏడో పిచ్ను ఉపయోగిస్తున్నారు.మైదానం పరిమాణాల విషయానికి వస్తే నేరుగా బౌండరీ వరకు దూరం సుమారు డెబ్బై ఐదు మీటర్లు ఉంటుంది. రెండు వైపులా కూడా దూరం సమానంగా సుమారు అరవై ఐదు మీటర్లు చొప్పున ఉంది. మొత్తం మైదానం ఒక అద్భుతమైన రంగస్థలంలా కనిపిస్తోంది.
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?