Devendra Fadnavis: నిషేధిత గ్రూప్ పీఎఫ్ఐ సైలెంట్ కిల్లర్ లాంటిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: ఐదేళ్లపాటు కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సమాజంలో హింసకు బీజం వేస్తోందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం అన్నారు. సైలెంట్ కిల్లర్లా పుకార్లు వ్యాప్తి చేస్తూ హింసను ప్రేరేపించడమే పీఎఫ్ఐ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్ఐ సంస్థపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ హింసకు బీజం వేస్తోందనడానికి ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. పుకార్లు వ్యాప్తి చేయడం, నిధుల సేకరణ, హింసను ప్రేరేపించడం వారి లక్ష్యమని ఆయన తెలిపారు. “ఈశాన్య రాష్ట్రంలో ఒక మసీదు కూల్చివేతకు సంబంధించిన నకిలీ వీడియో హింసను ప్రేరేపించే ఉద్దేశంతో ప్రచారం చేయబడింది. గతంలో అమరావతిలో ఇటువంటి సంఘటనను చూశాము. ఆ వీడియో బంగ్లాదేశ్కు చెందినది అని తరువాత వెలుగులోకి వచ్చింది” ఫడ్నవీస్ చెప్పారు. పీఎఫ్ఐని నిషేధించాలని డిమాండ్ చేసిన మొదటి రాష్ట్రం కేరళ అని ఫడ్నవీస్ అన్నారు. ఆ తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేశాయి.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్
కేంద్రప్రభుత్వం పీఎఫ్ఐని అన్ని రాష్ట్రాల మాదిరిగానే నిషేధించడంతో మహారాష్ట్రలో కూడా నిషేధం అమలుపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. “కొన్ని గ్రూపులు దేశంలోని సామాజిక నిర్మాణాన్ని భంగపరచడానికి నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయి. అటువంటి కార్యకలాపాలలో పీఎఫ్ఐ ముందుంది” అని ఆయన అన్నారు. నిషేధిత సంస్థ పీఎఫ్ఐ ఆటంకాలు సృష్టించడానికి అనేక కథనాలను రూపొందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. పీఎఫ్ఐ వారి కార్యకలాపాల కోసం నిధులను సేకరించడం ప్రారంభించిందన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!