Devendra Fadnavis: నిషేధిత గ్రూప్ పీఎఫ్ఐ సైలెంట్ కిల్లర్ లాంటిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: ఐదేళ్లపాటు కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సమాజంలో హింసకు బీజం వేస్తోందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం అన్నారు. సైలెంట్ కిల్లర్లా పుకార్లు వ్యాప్తి చేస్తూ హింసను ప్రేరేపించడమే పీఎఫ్ఐ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్ఐ సంస్థపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ హింసకు బీజం వేస్తోందనడానికి ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. పుకార్లు వ్యాప్తి చేయడం, నిధుల సేకరణ, హింసను ప్రేరేపించడం వారి లక్ష్యమని ఆయన తెలిపారు. “ఈశాన్య రాష్ట్రంలో ఒక మసీదు కూల్చివేతకు సంబంధించిన నకిలీ వీడియో హింసను ప్రేరేపించే ఉద్దేశంతో ప్రచారం చేయబడింది. గతంలో అమరావతిలో ఇటువంటి సంఘటనను చూశాము. ఆ వీడియో బంగ్లాదేశ్కు చెందినది అని తరువాత వెలుగులోకి వచ్చింది” ఫడ్నవీస్ చెప్పారు. పీఎఫ్ఐని నిషేధించాలని డిమాండ్ చేసిన మొదటి రాష్ట్రం కేరళ అని ఫడ్నవీస్ అన్నారు. ఆ తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేశాయి.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్
కేంద్రప్రభుత్వం పీఎఫ్ఐని అన్ని రాష్ట్రాల మాదిరిగానే నిషేధించడంతో మహారాష్ట్రలో కూడా నిషేధం అమలుపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. “కొన్ని గ్రూపులు దేశంలోని సామాజిక నిర్మాణాన్ని భంగపరచడానికి నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయి. అటువంటి కార్యకలాపాలలో పీఎఫ్ఐ ముందుంది” అని ఆయన అన్నారు. నిషేధిత సంస్థ పీఎఫ్ఐ ఆటంకాలు సృష్టించడానికి అనేక కథనాలను రూపొందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. పీఎఫ్ఐ వారి కార్యకలాపాల కోసం నిధులను సేకరించడం ప్రారంభించిందన్నారు.
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!