ATM Withdrawal Limit: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం విత్ డ్రా లిమిట్ 50 శాతం తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్..
- ఏటీఎం విత్ డ్రా పరిమితుల్లో మార్పులు..
- ఏకంగా 50 శాతం మేర తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఖాతాదారులకు షాకిస్తూ డెబిట్ కార్డుల ద్వారా జరిపే నగదు విత్డ్రా పరిమితుల్లో భారీ మార్పులు చేసింది. సైబర్ మోసాలను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన ప్రీమియం డెబిట్ కార్డులపై రోజువారీ నగదు విత్ డ్రా పరిమితిని ఏకంగా 50 శాతం మేర తగ్గించారు. గతంలో ఉన్న పరిమితులను సగానికి కుదిస్తూ బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
బ్యాంక్ తన కార్డులను రెండు కేటగిరీలుగా విభజించి ఈ తగ్గింపును అమలు చేస్తోంది. అందులో ముఖ్యంగా.. రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్), రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం మరియు వీసా గోల్డ్ కార్డులు కలిగిన వారు ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 50,000 మాత్రమే విత్డ్రా చేయగలరు. అంతక ముందు ఈ విత్ డ్రా లిమిట్ రూ.లక్ష వరకు ఉండేది. అంటే 50 శాతం మేర తగ్గించారు.
ఇక రెండో కేటగిరీలో.. రూపే సెలక్ట్, పీఎన్బీ రూపే సెలక్ట్ నియో లేదా ఎక్సెల్, వీసా సిగ్నేచర్ మరియు మాస్టర్ కార్డ్ బిజినెన్ డెబిట్ కార్డులకు ఈ పరిమితి వర్తిస్తుంది. గతంలో ఉన్న రూ. 1.50 లక్షల లిమిట్ ఇకపై రూ. 75,000 కు పరిమితం అవుతుంది. PNB ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఏటీఎం సెంటర్లలో జరిగే స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాల వల్ల ఖాతాదారులు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోకుండా ఈ పరిమితి రక్షణ కల్పిస్తుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, UPI, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలను పెంచాలని బ్యాంక్ భావిస్తోంది.
Also Read:India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
ఒకవేళ ఖాతాదారులకు అత్యవసరంగా ఎక్కువ నగదు కావాల్సి వస్తే.. వారు బ్యాంక్ బ్రాంచ్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ పరిమితిని తాత్కాలికంగా పెంచుకునే వెసులుబాటును కూడా బ్యాంక్ పరిశీలిస్తోంది. సాధారణ (క్లాసిక్) డెబిట్ కార్డుల పరిమితుల్లో ఎటువంటి మార్పులు లేవు. పీఎన్బీ వినియోగదారులు తమ కార్డు రకాన్ని బట్టి ఏప్రిల్ 1 నాటికి తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ramayana: భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్.. ‘రామాయణం’ ట్రైలర్కు భారీ ప్లాన్!
-
Astrology: జూలై 9 గురువారం దినఫలాలు.. మీది ఈ రాశియా? అయితే జాగ్రత్త..
-
US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..