ATM Withdrawal Limit: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం విత్ డ్రా లిమిట్ 50 శాతం తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్..
- ఏటీఎం విత్ డ్రా పరిమితుల్లో మార్పులు..
- ఏకంగా 50 శాతం మేర తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఖాతాదారులకు షాకిస్తూ డెబిట్ కార్డుల ద్వారా జరిపే నగదు విత్డ్రా పరిమితుల్లో భారీ మార్పులు చేసింది. సైబర్ మోసాలను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన ప్రీమియం డెబిట్ కార్డులపై రోజువారీ నగదు విత్ డ్రా పరిమితిని ఏకంగా 50 శాతం మేర తగ్గించారు. గతంలో ఉన్న పరిమితులను సగానికి కుదిస్తూ బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
Also Read
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
- Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
- Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
బ్యాంక్ తన కార్డులను రెండు కేటగిరీలుగా విభజించి ఈ తగ్గింపును అమలు చేస్తోంది. అందులో ముఖ్యంగా.. రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్), రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం మరియు వీసా గోల్డ్ కార్డులు కలిగిన వారు ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 50,000 మాత్రమే విత్డ్రా చేయగలరు. అంతక ముందు ఈ విత్ డ్రా లిమిట్ రూ.లక్ష వరకు ఉండేది. అంటే 50 శాతం మేర తగ్గించారు.
ఇక రెండో కేటగిరీలో.. రూపే సెలక్ట్, పీఎన్బీ రూపే సెలక్ట్ నియో లేదా ఎక్సెల్, వీసా సిగ్నేచర్ మరియు మాస్టర్ కార్డ్ బిజినెన్ డెబిట్ కార్డులకు ఈ పరిమితి వర్తిస్తుంది. గతంలో ఉన్న రూ. 1.50 లక్షల లిమిట్ ఇకపై రూ. 75,000 కు పరిమితం అవుతుంది. PNB ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఏటీఎం సెంటర్లలో జరిగే స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాల వల్ల ఖాతాదారులు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోకుండా ఈ పరిమితి రక్షణ కల్పిస్తుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, UPI, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలను పెంచాలని బ్యాంక్ భావిస్తోంది.
Also Read:India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
ఒకవేళ ఖాతాదారులకు అత్యవసరంగా ఎక్కువ నగదు కావాల్సి వస్తే.. వారు బ్యాంక్ బ్రాంచ్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ పరిమితిని తాత్కాలికంగా పెంచుకునే వెసులుబాటును కూడా బ్యాంక్ పరిశీలిస్తోంది. సాధారణ (క్లాసిక్) డెబిట్ కార్డుల పరిమితుల్లో ఎటువంటి మార్పులు లేవు. పీఎన్బీ వినియోగదారులు తమ కార్డు రకాన్ని బట్టి ఏప్రిల్ 1 నాటికి తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind Vs SL: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
-
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
ట్రెండింగ్
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!