ATM Withdrawal Limit: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం విత్ డ్రా లిమిట్ 50 శాతం తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్..
- ఏటీఎం విత్ డ్రా పరిమితుల్లో మార్పులు..
- ఏకంగా 50 శాతం మేర తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఖాతాదారులకు షాకిస్తూ డెబిట్ కార్డుల ద్వారా జరిపే నగదు విత్డ్రా పరిమితుల్లో భారీ మార్పులు చేసింది. సైబర్ మోసాలను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన ప్రీమియం డెబిట్ కార్డులపై రోజువారీ నగదు విత్ డ్రా పరిమితిని ఏకంగా 50 శాతం మేర తగ్గించారు. గతంలో ఉన్న పరిమితులను సగానికి కుదిస్తూ బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
Also Read
- SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
- Prices Hike : దేశం కొంపముంచనున్న వర్షాలు.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
- Reliance AGM 2026: జియో IPO నుంచి AI, 2 లక్షల ఉద్యోగాల వరకు.. ముఖేష్ అంబానీ 10 కీలక ప్రకటనలు
- PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
బ్యాంక్ తన కార్డులను రెండు కేటగిరీలుగా విభజించి ఈ తగ్గింపును అమలు చేస్తోంది. అందులో ముఖ్యంగా.. రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్), రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం మరియు వీసా గోల్డ్ కార్డులు కలిగిన వారు ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 50,000 మాత్రమే విత్డ్రా చేయగలరు. అంతక ముందు ఈ విత్ డ్రా లిమిట్ రూ.లక్ష వరకు ఉండేది. అంటే 50 శాతం మేర తగ్గించారు.
ఇక రెండో కేటగిరీలో.. రూపే సెలక్ట్, పీఎన్బీ రూపే సెలక్ట్ నియో లేదా ఎక్సెల్, వీసా సిగ్నేచర్ మరియు మాస్టర్ కార్డ్ బిజినెన్ డెబిట్ కార్డులకు ఈ పరిమితి వర్తిస్తుంది. గతంలో ఉన్న రూ. 1.50 లక్షల లిమిట్ ఇకపై రూ. 75,000 కు పరిమితం అవుతుంది. PNB ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఏటీఎం సెంటర్లలో జరిగే స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాల వల్ల ఖాతాదారులు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోకుండా ఈ పరిమితి రక్షణ కల్పిస్తుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, UPI, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలను పెంచాలని బ్యాంక్ భావిస్తోంది.
Also Read:India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
ఒకవేళ ఖాతాదారులకు అత్యవసరంగా ఎక్కువ నగదు కావాల్సి వస్తే.. వారు బ్యాంక్ బ్రాంచ్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ పరిమితిని తాత్కాలికంగా పెంచుకునే వెసులుబాటును కూడా బ్యాంక్ పరిశీలిస్తోంది. సాధారణ (క్లాసిక్) డెబిట్ కార్డుల పరిమితుల్లో ఎటువంటి మార్పులు లేవు. పీఎన్బీ వినియోగదారులు తమ కార్డు రకాన్ని బట్టి ఏప్రిల్ 1 నాటికి తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
-
NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్లో అసలేం జరిగింది?
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!