2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తులు అంతా సవ్యంగా సాగడం లేదన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ లోక్సభ స్థానంపై థానే బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ హాట్ కామెంట్స్ చేశారు.
సెంట్రల్ ముంబైలోని ధారవి ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగు వ్యక్తిని చంపి, అతని మృతదేహాన్ని బెడ్షీట్లో కప్పి, తన ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సమస్యను ఒక హిందూ సంస్థ లేవనెత్తిందని ఆదివారం ఒక అధికారి తెలిపారు.
Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శనివారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు. సుప్రియా సూలే, శరద్ పవార్ కుమార్తె, ప్రస్తుతం ఈమె బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో కొన్ని పట్టణాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే తరచుగా గొడవలు జరగడానికి ఆయా పట్టణాలకు గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పార్లమెంట్ సంబంధిత వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని, కానీ రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.