Maharashtra: లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తులు అంతా సవ్యంగా సాగడం లేదన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ లోక్సభ స్థానంపై థానే బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ బీజేపీ సహాయం లేకుండా థానే నుంచి ఎవరూ ఎన్నిక కాలేరని ఆయన వ్యాఖ్యనించారు. కళ్యాణ్తో పాటు, థానే, పాల్ఘర్ లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ అధిష్టానం గురించి కేల్కర్ మాట్లాడారు.
Also Read : Bhopal Fire Accident: భోపాల్లోని సాత్పురా భవన్లో అగ్ని ప్రమాదం
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
కళ్యాణ్- థానే ఒకే లోక్సభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు.. అప్పటి నుంచి బీజేపీ అగ్రనేతలు ఇక్కడ నుంచే ఎన్నికయ్యారని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ అన్నారు. రాంభౌమల్గి, జగన్నాథ్ పాటిల్ అక్కడి నుంచి ఎంపీలుగా పని చేశారు. చింతామన్ వనగా పాల్ఘర్ 9 సార్లు పోటీ చేశారు.. 4 సార్లు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులతో బీజేపీ చాలాకాలం పాటు పోరాడింది అని ఆయన అన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీట్లు శివసేనకు దక్కాయి.. అయితే, శివసేన గెలుపు కోసం మా కార్యకర్తలు అక్కడ తీవ్రంగా కష్టపడ్డారు అని కేల్కర్ తెలిపారు.
Also Read : Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్పై తమన్నా క్లారిటీ
కళ్యాణ్ లోక్సభ నియోజకవర్గంలో ఇటీవల స్థానిక బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సీటుపై శివసేనకు బీజేపీ మద్దతివ్వబోదని ఇందులో తీర్మానం చేశారు. దీంతో శ్రీకాంత్ షిండే దానిపై స్పందించారు. 2024లో ప్రజలందరూ నరేంద్ర మోడీని మళ్లీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందుకోసం మా వంతు ప్రయత్నం చేస్తామని శ్రీకాంత్ షిండే తెలిపాడు.
Also Read : Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..
కానీ డోంబివిలికి చెందిన కొందరు నాయకులు శివసేన-బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఏ పదవికి ఆశపడను అని శ్రీకాంత్ షిండే అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది శివసేన-బీజేపీ కూటమి సీనియర్ నేతలు నిర్ణయించనున్నారు. నేను నామినేషన్ వేయకున్నా.. అభ్యర్థి ఎవరంటే.. ప్రచారం చేసి గెలిపిస్తామని శ్రీకాంత్ షిండే వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?