Maharashtra: లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తులు అంతా సవ్యంగా సాగడం లేదన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ లోక్సభ స్థానంపై థానే బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ బీజేపీ సహాయం లేకుండా థానే నుంచి ఎవరూ ఎన్నిక కాలేరని ఆయన వ్యాఖ్యనించారు. కళ్యాణ్తో పాటు, థానే, పాల్ఘర్ లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ అధిష్టానం గురించి కేల్కర్ మాట్లాడారు.
Also Read : Bhopal Fire Accident: భోపాల్లోని సాత్పురా భవన్లో అగ్ని ప్రమాదం
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
కళ్యాణ్- థానే ఒకే లోక్సభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు.. అప్పటి నుంచి బీజేపీ అగ్రనేతలు ఇక్కడ నుంచే ఎన్నికయ్యారని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ అన్నారు. రాంభౌమల్గి, జగన్నాథ్ పాటిల్ అక్కడి నుంచి ఎంపీలుగా పని చేశారు. చింతామన్ వనగా పాల్ఘర్ 9 సార్లు పోటీ చేశారు.. 4 సార్లు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులతో బీజేపీ చాలాకాలం పాటు పోరాడింది అని ఆయన అన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీట్లు శివసేనకు దక్కాయి.. అయితే, శివసేన గెలుపు కోసం మా కార్యకర్తలు అక్కడ తీవ్రంగా కష్టపడ్డారు అని కేల్కర్ తెలిపారు.
Also Read : Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్పై తమన్నా క్లారిటీ
కళ్యాణ్ లోక్సభ నియోజకవర్గంలో ఇటీవల స్థానిక బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సీటుపై శివసేనకు బీజేపీ మద్దతివ్వబోదని ఇందులో తీర్మానం చేశారు. దీంతో శ్రీకాంత్ షిండే దానిపై స్పందించారు. 2024లో ప్రజలందరూ నరేంద్ర మోడీని మళ్లీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందుకోసం మా వంతు ప్రయత్నం చేస్తామని శ్రీకాంత్ షిండే తెలిపాడు.
Also Read : Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..
కానీ డోంబివిలికి చెందిన కొందరు నాయకులు శివసేన-బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఏ పదవికి ఆశపడను అని శ్రీకాంత్ షిండే అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది శివసేన-బీజేపీ కూటమి సీనియర్ నేతలు నిర్ణయించనున్నారు. నేను నామినేషన్ వేయకున్నా.. అభ్యర్థి ఎవరంటే.. ప్రచారం చేసి గెలిపిస్తామని శ్రీకాంత్ షిండే వెల్లడించారు.
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!