Maharashtra: “దేశంలో మోడీ.. రాష్ట్రంలో షిండే”.. బీజేపీ-శివసేన మధ్య చిచ్చుపెట్టిన యాడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహరాష్ట్రలో పాలక బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ పత్రికా ప్రకటన ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ‘‘దేశంలో మోడీ.. మహారాష్ట్రలో షిండే’’ అనే ట్యాగ్ లైన్ తో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ పత్రికా ప్రకటన వేయించింది. ఈ ప్రకటన బీజేపీలో అసంతృప్తికి కారణం అవుతోంది. ఈ పత్రికా ప్రకటనపై ప్రతిపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేనలు ఫైర్ అవుతున్నాయి.
గతంలో మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే ‘‘ ఢిల్లీమే నరేంద్ర ఔర్ రాజ్య మే దేవేంద్ర’’ అని ప్రచారం చేసింది. గతేడాది శివసేన పార్టీలో అసమ్మతి తరువాత మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతవరకు ఉద్దశ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం మహావికాస్ అఘాడీ గద్దె దిగాల్సి వచ్చింది. ఏక్ నాథ్ షిండే సీఎం, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో షిండే క్యాంప్ నాయకులు బహిరంగంగానే బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ తమను సవతి తల్లిలా చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎంగా ఏక్ నాథ్ షిండేకు 26.1 శాతం మద్దతు, ఫడ్నవీస్ కు 23 శాతం మద్దతు ఉన్నట్లు ఓ ప్రైవేట్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇరు పార్టీలకు కలిసి 46 శాతం ప్రజాధరణ ఉన్నట్లు సర్వేలో తేలింది. బీజేపీకి 30.2 శాతం, షిండే శివసేనకు 16.2 శాతం ప్రజలు మద్దతు పలికారని ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Gambhir vs Dhoni: ఎంఎస్ ధోనీ వల్ల భారత్కు ప్రపంచకప్లు రాలేదు.. అసలు హీరో అతడే: గంభీర్
ప్రధాని మోడీ, సీఎం ఏక్ నాథ్ షిండేలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, పథకాల వల్లే పాపులారిటీ పెరిగిందని యాడ్ పేర్కొంది. ఇదిలా ఉంటే బాలా సాహెబ్ ఠాక్రే గురించి ప్రస్తావన లేకపోవడంపై ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయాలను ప్రకటన కోసం ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను చూసి షిండే వర్గం ఎంతగానో భయపడుతోందని, ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఠాక్రేను పూర్తిగా మర్చిపోయారని రౌత్ ట్వీట్ చేశారు. ‘‘ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో దినపత్రికల్లో ఇలాంటి ప్రకటనలు చూడలేదు. ఆ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం షిండే ఫొటోలు ఉన్నాయి. వారు (శివసేన) వారు బాలాసాహెబ్ ఠాక్రే సైనికులని చెప్పారు, అయితే బాలాసాహెబ్ థాకరే మరియు ఆనంద్ డిఘేల ఫోటోలు ప్రకటనలో లేవు’’ అని ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమర్శించారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే ప్రకటనపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇందులో దేవేంద్ర ఫడ్నవీస్ ను తక్కువగా చేసినట్లు ఉందని, ఇద్దరం కలిసి ప్రతిపక్షాలకు బలం చూపాలని, షిండే వర్గంలోని 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలోకి తెచ్చాయని శివసేన ఎంపీ గజన కిరీటికర్ అనడాన్ని తప్పుపట్టారు.
कोट्यावधी रुपये खर्च करून केलेली ही जाहिरातबाजी.या आनंदाच्या क्षणी मा.मू. एकनाथ शिंदे यांना शिवसेना प्रमुख बाळासाहेब ठाकरे यांचा नेमका विसर पडलाय..आम्हीच
शिवसेना हा त्यांचा फुगा फुटला. जाहिरातीत शिवसेना प्रमुख बालासाहेब ठाकरे यांचा फोटो टाकायला यांची तंतरली.
मोदी शहांचे इतके… pic.twitter.com/owsumBeN12— Sanjay Raut (@rautsanjay61) June 13, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!