Maharashtra: పేర్ల మార్పుతో 8 పట్టణాల్లో గొడవలు..
Maharashtra: మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో కొన్ని పట్టణాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే తరచుగా గొడవలు జరగడానికి ఆయా పట్టణాలకు గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పట్టణాలకు పెట్టడంతో రెండు వర్గాలకు చెందిన వారు గొడవ పడటం అదికాస్త మత కలహాలు మారడం పరిపాటిగా మారిపోయింది. గడచిన 3 నెలల్లో మహారాష్ట్రలోని 8 పట్టణాల్లో గొడవలు జరిగాయి. వీటికి ప్రధాన కారణం కేవలం గతలో ఉన్న పేర్లను మార్చడమేనని పేర్కొంటున్నారు.
Read also: Fish Medicine: నేడే చేప మందు పంపిణీ.. ప్రారంభించిన మంత్రి తలసాని
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
గడచిన మూడు నెలల్లో మహారాష్ట్రలోని 8 నగరాల్లో తరచూ ఉద్రికత్తలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్, అకోలా, షిగావ్, శెంగమ్నర్, జలగావ్, ముంబై, కోల్హాపూర్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవి చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొల్హాపూర్లో చెలరేగిన ఉద్రికత్తల విషయమై పోలీసులకు, ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్కు చెందిన ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన తర్వాతే ఈ తరహా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని స్వయంగా పోలీసు వర్గాలే వెల్లడించాయి. ముంబైలోని మాల్వాణి ప్రాంతంలో, ఛత్రపతి శంభాజీ నగర్లో శ్రీరామనవమి సందర్భంగా హింస జరిగిందని పోలీసులు తెలిపారు.
Read also: Love Came To Painful : ప్రేమ ముసుగులో హత్యలు.. శ్రద్ధ నుండి సరస్వతి హత్య వరకు
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ముఖ్యమైన మత ఘర్షణలు
మార్చి 31, 2023 – శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి. పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి. పోలీసులు అరెస్ట్ చేసిన 76 మందిలో 9 మంది మైనర్లు.
మే 13, 2023 – సోషల్ మీడియా పోస్ట్ వల్ల అకోలాలో మత హింస. ఒకరి మృతి, 10 మందికి గాయాలు. వంద మంది అరెస్ట్.
మే 14, 2023 –షిగావ్ (అహ్మద్నగర్)లో ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మత ఉద్రిక్తతలు. 150 మందిపై కేసు నమోదు, 30 మంది అరెస్ట్.
మే 14, 2023 – త్రయంబకేశ్వర్లో మత ఉద్రిక్తతలు. నలుగురి అరెస్ట్. విచారణ కోసం సిట్ ఏర్పాటు.
జూన్ 6, 2023 – లవ్ జిహాద్కు వ్యతిరేకంగా శెంగమ్నర్లో ర్యాలీ. సమనాపూర్ గ్రామంలో రాళ్ల దాడి.
జూన్ 7, 2023 – మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తించిన పోస్టింగ్పై కొల్హాపూర్లో హింసాత్మక ఘటనలు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?