Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు. ‘ఔరంగజేబు సంతానం’ అంటూ ఫడ్నవీస్ కామెంట్స్ పై ఓవైసీ ‘గాడ్సే’ సంతానం ఎవరంటూ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గిరిరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.
నాథూరామ్ గాడ్సేను భారతదేశ విలువైన పుత్రుడు(సుపుత్)గా గిరిరాజ్ సింగ్ అభివర్ణించారు. గాడ్సే, గాంధీని చంపినప్పటికీ, ఈ దేశ పుత్రుడు, ఈ దేశంలోనే పుట్టాడని.. బాబార్, ఔరంగజేబులా ఆక్రమణదారు కాదని వ్యాఖ్యానించారు. బాబర్ కుమారులుగా పిలువబడే వారు భారతమాత కుమారులు కాలేరని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
Read Also: NCP: అజిత్ పవార్కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..
టిప్పుసుల్తాన్, ఔరంగజేబులకు అనుకూలంగా ఓ వర్గం వ్యక్తులు సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. కొందరు ఔరంగజేబు సంతానం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారని, వారు ఎక్కడ నుంచి వచ్చారో.. విచారణలో తేలుస్తామంటూ వ్యాఖ్యానించారు.
దీనికి ప్రతిగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్ ‘ఔరంగజేబు సంతానం’’ అంటున్నారు.. ఈ విషయంలో మీరు అంత నిపుణులా.. అయితే గాడ్సే, ఆప్టేల సంతానం ఎవరో కూడా తెలుసుకోవాలి అని విమర్శించారు. ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలు మతపరమైనవిగా చెప్పారు. జాతిపితను చంపిన వ్యక్తిని ప్రశంసించారని.. అతను మొఘల్ చక్రవర్తులను భారత్ కు వ్యతిరేకమైన మనుషులుగా పిలిచారని అన్నారు.
తాజావార్తలు
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!