Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు. ‘ఔరంగజేబు సంతానం’ అంటూ ఫడ్నవీస్ కామెంట్స్ పై ఓవైసీ ‘గాడ్సే’ సంతానం ఎవరంటూ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గిరిరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.
నాథూరామ్ గాడ్సేను భారతదేశ విలువైన పుత్రుడు(సుపుత్)గా గిరిరాజ్ సింగ్ అభివర్ణించారు. గాడ్సే, గాంధీని చంపినప్పటికీ, ఈ దేశ పుత్రుడు, ఈ దేశంలోనే పుట్టాడని.. బాబార్, ఔరంగజేబులా ఆక్రమణదారు కాదని వ్యాఖ్యానించారు. బాబర్ కుమారులుగా పిలువబడే వారు భారతమాత కుమారులు కాలేరని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
Read Also: NCP: అజిత్ పవార్కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..
టిప్పుసుల్తాన్, ఔరంగజేబులకు అనుకూలంగా ఓ వర్గం వ్యక్తులు సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. కొందరు ఔరంగజేబు సంతానం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారని, వారు ఎక్కడ నుంచి వచ్చారో.. విచారణలో తేలుస్తామంటూ వ్యాఖ్యానించారు.
దీనికి ప్రతిగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్ ‘ఔరంగజేబు సంతానం’’ అంటున్నారు.. ఈ విషయంలో మీరు అంత నిపుణులా.. అయితే గాడ్సే, ఆప్టేల సంతానం ఎవరో కూడా తెలుసుకోవాలి అని విమర్శించారు. ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలు మతపరమైనవిగా చెప్పారు. జాతిపితను చంపిన వ్యక్తిని ప్రశంసించారని.. అతను మొఘల్ చక్రవర్తులను భారత్ కు వ్యతిరేకమైన మనుషులుగా పిలిచారని అన్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!