NCP: అజిత్ పవార్కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శనివారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు. సుప్రియా సూలే, శరద్ పవార్ కుమార్తె, ప్రస్తుతం ఈమె బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు. 1999లో శరద్ పవార్, పీఏ సంగ్మా కలిసి ఎన్సీపీ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం సుప్రియాసూలేకి మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళా యువత, లోక్సభ సమన్వయం బాధ్యతలు అప్పగించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా బాధ్యతలను ప్రఫుల్ పటేల్ చూసుకుంటారు.
ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తట్కరేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఎన్సీపీ అధినేతగా నంద శాస్త్రిని నియమించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సుప్రియా సూలే మాట్లాడుతూ.. పార్టీకి తాను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. శరద్ పవార్ తమ్ముడి కొడుకు అజిత్ పవార్ సమక్షంలోనే ఈ ప్రకటన వెలువడింది. ఎన్సీపీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్ కు చెక్ పెట్టేలా శరద్ పవార్ చాణక్యం ప్రదర్శించారు.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Also: Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్యల నిశ్చితార్థ వేడుకలో మెగా ఫ్యామిలీ
గత నెలలో ఎన్సీపీ పార్టీలో హైడ్రామా నడించింది. పార్టీ అధ్యక్షుడిగా తాను రాజీనామా చేస్తున్నానని శరద్ పవార్ ప్రకటించారు. అయితే పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ సమావేశంలో శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మాణం చేశారు. దీంతో ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా శరద్ పవార్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన నేపథ్యంలో గతంలో శరద్ పవార్ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అజిత్ పవార్, బీజేపీతో చేతులు కలిపారని విమర్శలు కూడా వచ్చాయి.
అయితే అజిత్ పవార్ కు చెక్ పెట్టేవిధంగా పార్టీలో తన తర్వాత కీలక నేతగా సుప్రియా సూలే ఉంటుందని శరద్ పవార్ చెప్పకనే చెప్పారు. మరోవైపు శరద్ పవార్, అజిత్ పవార్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అజిత్ పవార్ ఈ ప్రకటనతో కలత చెందలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ఆయన మహారాష్ట్ర బాధ్యతలు చూస్తారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..